Colours swathi : ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ను చూపిస్తూ దూసుకెళ్ళింది.కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అష్టా చమ్మ సినిమాలో నానీ జోడీగా నటించి మెప్పించింది. తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా నటించి మెప్పించింది. అష్టా చమ్మలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్వాతికి తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లు అందాయి. . తమిళం లో సుబ్రమణ్య పురం అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకుంది కలర్స్ స్వాతి.వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లింది కలర్స్ స్వాతి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించింది.
నిఖిల్ జోడీగా ఆమె నటించిన స్వామిరార సినిమా తో కలర్స్ స్వాతికి మరో సూపర్ హిట్ లభించింది. ఆ తరువాత మరోసారి నిఖిల్ కార్తికేయ సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇక ఆ తరువాత సినిమా ఆఫర్స్ తగ్గడంతో.. పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి..ఫ్యామిలీ ని చూసుకుంటే గడిపేసింది.తాజాగా సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. రీ ఎంట్రీ లో తన ఇమేజ్ కు తగ్గట్టు కథలను సెలక్ట్ చేసుకుంటుంది. అయితే రీ ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది స్వాతి. ఆ ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో ను నాకు చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డానుఅంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. కానీ నా స్నేహితులు ధైర్యం చెప్పడం వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి. ప్రస్తుంతం సోషల్ మీడియా లో ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!