Prakasam: ఒంగోలు భూ కబ్జాల కేసులో 38 మందిని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కొనసాగుతున్న భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వీలైనంత తొందరలో విచారణ దర్యాప్తు పూర్తి చేస్తాని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జాలపై ఎస్పీ మలికా గార్గ్తో కలిసి చర్చించారు. భూకబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, ఈ మేరకు లాయర్పేటలోని ఓ ఇంట్లో తనిఖీలు చేయగా.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కొన్ని పత్రాలు సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని కలెక్టర్ చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
అన్ని పత్రాలకు నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 572 ఫేక్ డాక్యుమెంట్స్, 60 స్టాంప్స్, 1200 జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో 38 మందిని అరెస్టు చేశారు.. కనిగిరి, మార్కాపురంలో కూడా భూకబ్జాలపై సిట్ దర్యాప్తు జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి భూకబ్జాలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది.. ఖాళీ భూములు గుర్తించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు అని కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.
Read Also: Janareddy: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు
బాధితులు ఎవరైనా ఉంటే సిట్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే, భూములకు నకిలీ జీపీఏ, వీలునామాలు తయారు చేసి కబ్జా చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ఆస్తుల్ని ఒంగోలులో 52 గుర్తించాము.. భూకబ్జాల కేసులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో 2 ప్రధాన పార్టీలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!