Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
- దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు
- ఎగిరి గంతేసిన దుకాణదారుడు
- అంతలోనే ఆవిరైన సంతోషం
- వెంటనే నగదు విత్డ్రా చేసిన బ్యాంకు అధికారులు
- ఖాతాను స్తంభింపజేసిన బ్యాంకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నడుపుతున్న ఓ దుకాణదారుడి భార్య ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.999 కోట్లు వచ్చాయి. తన భార్య ఖాతాలోకి ఇంత డబ్బు రావడంతో దుకాణదారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ అతని ఆనందం వెంటనే ఆవిరైపోయింది. 48 గంటల్లో ఈ మొత్తం డబ్బును విత్డ్రా చేసి, బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. ఇప్పుడు దుకాణదారుడు అందులో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి నెలకొంది. అతని వ్యాపారం కూడా నిలిచిపోయింది. ఎందుకంటే తరచూ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
READ MORE: Vizianagaram Utsav: పైడితల్లి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు కేబినెట్కు ఆహ్వానం..
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
వ్యాపార వార్తాపత్రిక మింట్లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రభాకర్ బెంగళూరులో ఒక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన భార్య పొదుపు ఖాతాను పరిశీలిస్తున్నప్పుడు అందులో కోట్ల రూపాయలు ఉన్నట్లు చూశాడు. ఖాతాలో రూ.999 కోట్లు జమయినట్లు గుర్తించాడు. సంతోషించేలోపే వారి పరిస్థితి దుఃఖంగా మారింది. 48 గంటల్లో మొత్తం డబ్బును విత్డ్రా చేసి ఖాతాను క్లోజ్ చేశారు. పొరపాటున రూ.999 కోట్లు ఖాతాలోకి వచ్చాయని, ఆ తర్వాత ఖాతాను స్తంభింపజేశారని ప్రభాకర్ తెలిపాడు.
READ MORE:Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
తనకు సాయం చేయడానికి బదులు ఈ డబ్బు ఎలా వచ్చిందని బ్యాంకులు వివరాలు అడుగుతున్నాయని ప్రభాకర్ చెబుతున్నాడు. “ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు అకౌంట్ని బంద్ చేశారు. బ్యాంకు వెళ్లినా.. ఫలితం లేకపోయింది. కొంత మంది విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బు కూడా అందులో ఉంది. ఆ నగదు కూడా తీసుకోవాడానికి వీలు లేకుండా చేశారు. దీనిపై బ్యాంకుకు మెయిల్ కూడా పంపినా ఎలాంటి సమాధానం రాలేదు.” అని వాపోయాడు. ఇదిలా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..