Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
- దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు
- ఎగిరి గంతేసిన దుకాణదారుడు
- అంతలోనే ఆవిరైన సంతోషం
- వెంటనే నగదు విత్డ్రా చేసిన బ్యాంకు అధికారులు
- ఖాతాను స్తంభింపజేసిన బ్యాంకు
బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నడుపుతున్న ఓ దుకాణదారుడి భార్య ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.999 కోట్లు వచ్చాయి. తన భార్య ఖాతాలోకి ఇంత డబ్బు రావడంతో దుకాణదారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ అతని ఆనందం వెంటనే ఆవిరైపోయింది. 48 గంటల్లో ఈ మొత్తం డబ్బును విత్డ్రా చేసి, బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. ఇప్పుడు దుకాణదారుడు అందులో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి నెలకొంది. అతని వ్యాపారం కూడా నిలిచిపోయింది. ఎందుకంటే తరచూ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
READ MORE: Vizianagaram Utsav: పైడితల్లి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు కేబినెట్కు ఆహ్వానం..
Also Read
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
వ్యాపార వార్తాపత్రిక మింట్లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రభాకర్ బెంగళూరులో ఒక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన భార్య పొదుపు ఖాతాను పరిశీలిస్తున్నప్పుడు అందులో కోట్ల రూపాయలు ఉన్నట్లు చూశాడు. ఖాతాలో రూ.999 కోట్లు జమయినట్లు గుర్తించాడు. సంతోషించేలోపే వారి పరిస్థితి దుఃఖంగా మారింది. 48 గంటల్లో మొత్తం డబ్బును విత్డ్రా చేసి ఖాతాను క్లోజ్ చేశారు. పొరపాటున రూ.999 కోట్లు ఖాతాలోకి వచ్చాయని, ఆ తర్వాత ఖాతాను స్తంభింపజేశారని ప్రభాకర్ తెలిపాడు.
READ MORE:Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
తనకు సాయం చేయడానికి బదులు ఈ డబ్బు ఎలా వచ్చిందని బ్యాంకులు వివరాలు అడుగుతున్నాయని ప్రభాకర్ చెబుతున్నాడు. “ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు అకౌంట్ని బంద్ చేశారు. బ్యాంకు వెళ్లినా.. ఫలితం లేకపోయింది. కొంత మంది విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బు కూడా అందులో ఉంది. ఆ నగదు కూడా తీసుకోవాడానికి వీలు లేకుండా చేశారు. దీనిపై బ్యాంకుకు మెయిల్ కూడా పంపినా ఎలాంటి సమాధానం రాలేదు.” అని వాపోయాడు. ఇదిలా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!