Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
- దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు
- ఎగిరి గంతేసిన దుకాణదారుడు
- అంతలోనే ఆవిరైన సంతోషం
- వెంటనే నగదు విత్డ్రా చేసిన బ్యాంకు అధికారులు
- ఖాతాను స్తంభింపజేసిన బ్యాంకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నడుపుతున్న ఓ దుకాణదారుడి భార్య ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.999 కోట్లు వచ్చాయి. తన భార్య ఖాతాలోకి ఇంత డబ్బు రావడంతో దుకాణదారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ అతని ఆనందం వెంటనే ఆవిరైపోయింది. 48 గంటల్లో ఈ మొత్తం డబ్బును విత్డ్రా చేసి, బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. ఇప్పుడు దుకాణదారుడు అందులో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి నెలకొంది. అతని వ్యాపారం కూడా నిలిచిపోయింది. ఎందుకంటే తరచూ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
READ MORE: Vizianagaram Utsav: పైడితల్లి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు కేబినెట్కు ఆహ్వానం..
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
వ్యాపార వార్తాపత్రిక మింట్లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రభాకర్ బెంగళూరులో ఒక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన భార్య పొదుపు ఖాతాను పరిశీలిస్తున్నప్పుడు అందులో కోట్ల రూపాయలు ఉన్నట్లు చూశాడు. ఖాతాలో రూ.999 కోట్లు జమయినట్లు గుర్తించాడు. సంతోషించేలోపే వారి పరిస్థితి దుఃఖంగా మారింది. 48 గంటల్లో మొత్తం డబ్బును విత్డ్రా చేసి ఖాతాను క్లోజ్ చేశారు. పొరపాటున రూ.999 కోట్లు ఖాతాలోకి వచ్చాయని, ఆ తర్వాత ఖాతాను స్తంభింపజేశారని ప్రభాకర్ తెలిపాడు.
READ MORE:Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
తనకు సాయం చేయడానికి బదులు ఈ డబ్బు ఎలా వచ్చిందని బ్యాంకులు వివరాలు అడుగుతున్నాయని ప్రభాకర్ చెబుతున్నాడు. “ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు అకౌంట్ని బంద్ చేశారు. బ్యాంకు వెళ్లినా.. ఫలితం లేకపోయింది. కొంత మంది విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బు కూడా అందులో ఉంది. ఆ నగదు కూడా తీసుకోవాడానికి వీలు లేకుండా చేశారు. దీనిపై బ్యాంకుకు మెయిల్ కూడా పంపినా ఎలాంటి సమాధానం రాలేదు.” అని వాపోయాడు. ఇదిలా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!