CM YS Jagan Ongole Tour: రేపు ఒంగోలుకు వైఎస్ జగన్.. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Ongole Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు.. ఒంగోలు నగరంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.. ఇక, ఒంగోలు పర్యటన కోసం.. రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న ఆయన.. ఉదయం 10.20 గంటలకు ఒంగోలులోని అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30 ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 11.25 నుంచి 12.25 వరకు సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.45 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు..
Read Also: Hyderabad: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురు అరెస్ట్..
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. గత కొద్ది కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఒంగోలు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్ధానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. ప్రభుత్వం తొలివిడత 70 కోట్ల నగదును విడుదల చేసింది.. అయితే, ఆ తర్వాత రెండవ విడత నగదు విడుదలలో జాప్యం జరగటంతో ఒంగోలులో వైసీపీ పట్టాలు ఇవ్వలేదని పెద్దఎత్తున టీడీపీ విమర్శలకు దిగింది.. దీంతో సీరియస్ గా తీసుకున్న బాలినేని.. పలుమార్లు సీఎం జగన్ ను కలసి పరిస్థితి తీవ్రతను వివరించారు.. 25 వేల మందికి పట్టాలు పంపిణీ చేయలేక పోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు.. దీంతో సీఎం జగన్ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చే సేందుకు అవసరమైన భూ సేకరణకు, లే అవుట్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది.
Read Also: Geethanjali Malli Vachindhi: స్మశాన వాటికలో టీజర్ లాంచ్..BVS రవికి కొత్త డౌట్?
గతంలో చెప్పినట్టుగానే ఇప్పటికే పేదలకు పంపిణీ చేసేందుకు పట్టాలను కూడా సిద్దం చేశారు. రేపు సీఎం జగన్ చేతులు మీదుగా ఒంగోలులో అర్హులైన ప్రజలందరికి ఇళ్ల పట్టాలు అందించనున్నారు. మరోవైపు ఒంగోలు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 350 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నగర ప్రజల దాహార్తి కూడా తీరనుంది.. ప్రాజెక్టు పూర్తయితే ఒంగోలు ప్రజలకు ప్రతీరోజు తాగునీరు అందించే అవకాశం ఉంది.. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. భారీ ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. పోలీసులు సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!