Hyderabad: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలు దారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. కాగా.. గుంటూరు జిల్లా చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదు పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
Read Also: Damodara Rajanarsimha: ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులో తీసుకురావాలి..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
2017 ఏప్రిల్లో గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్గా అందజేశారు. ఒక యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ ఇచ్చారు. మిగిలిన 25 శాతం నగదును లబ్ధిదారుడే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండో విడత భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కొంతవరకు నగదు ఇచ్చారు. మిగిలిన రైతులకు రూ.2కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉండగా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు వాపోయారు. ఈ గొర్రెల పంపిణీ పథకంలో పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కై, కాంట్రాక్టర్లు బినామీ పేర్ల మీద డబ్బులు కాజేశారని ఏసీబీ అధికారుల దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో స్కామ్ పై విచారణ చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!