CM YS Jagan: రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందారులకు ,పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఆపేశాడని.. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు పెన్షన్లు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. అవ్వ తాతల ఉసురు పోసుకుంటున్నాడన్నారు.
Read Also: Kesineni Swetha: కేశినేని నాని బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం..
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లు భూములు కొనుక్కున్నారని.. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చామా, లేదంటే జిరాక్స్ కాపీలు ఇచ్చామా అంటూ ప్రశ్నించారు. 2014లో కూటమి మేనిఫెస్టో పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారని.. అప్పుడు అమలు చేయలేని హామీలు, ఇప్పుడు మళ్లీ అమలు చేస్తామని చెప్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారని, ఇంటికి ఓ బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కానీ చంద్రబాబు మాటలు నమ్మొద్దన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిలబడాలన్నా, అవ్వతాతలకు ఇంటికే పెన్షన్ రావాలన్నా , అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, విద్యా వైద్య రంగాలు బాగుపడాలన్నా.. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఇంటికి మంచి చేసిన ఫ్యాన్ను ఇంట్లో ఉంచాలని.. మీకు చెడు చేసిన సైకిల్ను ఇంటి బయటపడేయాలని.. తాగి వాడేసిన గ్లాసును సింక్లో వేయాలని ప్రజలను సీఎం జగన్ కోరారు.
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!