CM Jagan: మరో రెండు వారాల్లో కురుక్షేత్రం.. కౌరవ సైన్యాన్ని ప్రజలు నమ్మొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: మండుటెండలో సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగనుందని.. ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని , దుష్ట చతుష్టయాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. మూకుమ్మడిగా కలిసి వచ్చి, మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారని.. మీకు మంచి చేసిన మీ బిడ్డపై పొత్తుల పార్టీలు యుద్ధం చేస్తున్నాయన్నారు. తాను నమ్ముకుంది పేద ప్రజల్ని, పైనున్న దేవుడ్ని అని సీఎం జగన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని.. రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధి, పేద ప్రజల భవిష్యత్తుని, పేద ప్రజల తలరాతని నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇస్తున్న పథకాలన్నీ ముగిసిపోతాయని సీఎం అన్నారు.
Read Also: Janasena Symbol: కూటమికి గ్లాస్ గండం..ఫ్రీ సింబల్ జాబితాలో జనసేన గాజు గ్లాస్ గుర్తు
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
పేద ప్రజలు మోసపోతారని.. అందుకే ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ శిలువ నోట్లో తలకాయి పెట్టడం లాంటిదేనన్నారు. తాను విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా, పేద ప్రజలకు మరింత మంచి చేయాలని తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాలని.. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేసిన నాయకులు ఉన్నారన్నారు. కానీ మీ బిడ్డ మాత్రం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి, పేద ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం, మీ బిడ్డదేనన్నారు. విశ్వసనీయత కలిగిన ప్రభుత్వానికి ఓటు వేయాలన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు, పిల్లలందరికీ హీరో బచ్చాలాగానే కనిపిస్తాడన్నారు. చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను, ఇంటింటికి మంచి చేసి ఒక్కడినే ఎన్నికల బరిలో నిలబడ్డానన్నారు. బచ్చా అనుకుంటున్న ఈ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక, నువ్వు కలిసి వచ్చిన వాళ్ళందరితో పొత్తులు పెట్టుకున్నావన్నారు. నువ్వు చేసిన మంచి చెప్పి చంద్రబాబు ఓటు అడగాలన్నారు. ప్రజలకు ప్రతి ఇంట్లో మంచి జరిగి ఉంటే, మీరే సైనికులుగా మళ్లీ మన ప్రభుత్వాన్ని తీసుకురావాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!