Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Ys Jagan Speech At Eluru Public Meeting

CM YS Jagan: సూపర్ సిక్స్, కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

Published Date :May 1, 2024 , 5:35 pm
By Mahesh Jakki
CM YS Jagan: సూపర్ సిక్స్, కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్‌ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబును అడుగుతున్నా.. ఒక నిజమైన లీడర్ ఇంత మందికి రాష్ట్రంలో మంచి జరిగేలా చూస్తుంటే.. ఎవరు నిజమైన లీడర్ అని అడుగుతున్నామన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని జరగని విధంగా.. పిల్లల చదువు కోసం అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం తీసుకువచ్చింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన వంటి పథకాలు అందుబాటులో తీసుకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని మార్పులు.. ఇవన్నీ మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతున్న మార్పులని వ్యాఖ్యానించారు.

Read Also: Andhra Pradesh: ఎన్నికల వేళ.. 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం

అక్కా చెల్లెమ్మల సాధికారత కోసం చిన్న వడ్డీ చేయూత, అమ్మఒడి, కాపు నేస్తం, ఇళ్ల పట్టాలు, ఈబీసీ నేస్తం, అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వయం ఉపాధికి మీ బిడ్డ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ 59 నెలల కాలంలో ఎప్పుడు చూడని పథకాలు తీసుకువచ్చామని.. ప్రతి పేదవాడి బతుకులు మార్చాలని అడుగులు పడుతున్నాయన్నారు. లంచం లేకుండా, వివక్ష లేకుండా నేరుగా పెన్షన్లు ఇంటికి వస్తున్నాయంటే అది మీ బిడ్డ పాలన గొప్పతనమన్నారు. ప్రతి గ్రామంలోని రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకేలు వచ్చింది మీ బిడ్డ పాలనలోనే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు చేపట్టామన్నారు. మీ బిడ్డ పాలనకు ముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా మీ చేతికి అందించారా అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవుల్లో 68శాతం ఎస్సీలు, బీసీలు, వెనుకబడిన వర్గాలు ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా..రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా .. 50శాతం సీట్లలో వెనుకబడిన వర్గాలు పోటీ చేస్తున్నాయన్నారు.

Read Also: Pawan Kalyan: తోట త్రిమూర్తులు జనసేనలోకి రావట్లేదు.. పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఇది కాదా సామాజిక న్యాయం.. వెనుకబడిన వర్గాలకు ఇంత తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా..?.. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన మంచిపని ఏంటి అంటే ఒకటైన గుర్తు వస్తుందా..?.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేశానన్న వ్యక్తి పేరు చెబితే పేదవాడికి చేసిన ఒక మంచి పనైనా గుర్తు వస్తుందా.. అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈరోజు మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి హామిల వర్షం కురిపించాడు.. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవన్నీ చేశారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఖాతాలో వేస్తా అన్నారు, కనీసం ఒక్క రూపాయి అయినా వేశారా అంటూ ప్రశ్నించారు.

చేనేత రుణమాఫీ అన్నారు చేశారా.? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు.. నిర్మించారా..? ముఖ్యమైన హామీలు అంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇచ్చిన ప్రకటన చేశారు.. ఒకటైన జరిగిందా.? అని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటున్నారు.. కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ఎన్నికల్లో ఓటు వెయ్యని వారికి కూడా ఒకటే చెప్తున్నా.. మీరు మీ ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అనేది అడగాలన్నారు. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది.. అనేది ఆలోచన చేసి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • CM YS Jagan
  • Eluru Public Meeting
  • latest news

తాజావార్తలు

  • Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి..

  • CPI Narayana: ఆ ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలి!

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ రన్ టైంపై క్లారిటీ..!

  • Iran-China: హార్ముజ్‌ను తెరిచి ఉంచండి.. ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి!

  • Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions