CM YS Jagan: అప్పుడే విశాఖకు.. షిఫ్టింగ్పై సీఎం జగన్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు తెరపైకి వచ్చిన తర్వాత.. విశాఖ కేంద్రంగా పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముందుగా దసరా నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు షిఫ్ట్ అవుతారనే ప్రచారం సాగింది.. కానీ, కొన్ని కారణాల రీత్యా అది సాధ్యం కాలేదు.. అయితే, తాను ఎప్పుడు విశాఖకు షిఫ్ట్ అవుతాను అనేదానిపై సీఎం వైఎస్ జగనే క్లారిటీ ఇచ్చారు.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. రుషికొండలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్టు స్పష్టం చేశారు సీఎం జగన్..
Read Also: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. రియల్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, డిసెంబర్ లోపు తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం అని వెల్లడించారు.. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్గా విశాఖ మారింది.. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక, హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖపట్నంలోనూ విస్తారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు సీఎం.. వైజాగ్ కూడా ఐటీ హబ్గా మారుతుందన్నారు.. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీర ప్రాంతం విశాఖ సొంతం.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.. ఇక పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక్క ఫోన్ కాల్తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తాం అని ప్రకటించారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!