Geetanjali Suicide Case: గీతాంజలి ఫ్యామిలీకి అండగా సీఎం జగన్.. రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geetanjali Suicide Case: ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే.. గీతాంజలి కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించారు సీఎం జగన్.. అంతేకాదు గీతాంజలి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు.. ఇక, గీతాంజలి పసిబిడ్డల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం జగన్.. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్.
Read Also: AP DSC New Schedule 2024: డీఎస్సీ-2024 షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
అయితే, టీడీపీ, జనసేన వేధింపుల కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇక, గీతాంజలి మరణ వార్తను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారాయన.. ఆర్థిక సాయంగా 20 లక్షల రూపాయలు అందించనున్నట్టు ప్రకటించారు.. ఇక, ఆమె చనిపోయేలా ప్రేరేపించిన వారి పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని.. వారినిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.. మరోవైపు.. ఈ రోజు వైసీపీ నాయకులతో కలిసి తెనాలిలోని గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు..
Read Also: Athadu Vs Jalsa: ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు
కాగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా గ్రూపుల వేధింపుల వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంతో తెనాలికి చెందిన మహిళ ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. యూట్యూబ్ ఛానెల్లో గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!