CM Revanth Reddy: లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?.. ఆ టెక్నిక్ ఏందో తెలంగాణ యువతకు చెప్పండి!
- ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు
- నేను ఢిల్లీకి ఎందుకుపోతున్నానంటే?
- లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?
తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి పోయేది.. మాజీ సీఎం కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటును 7.25కి కుదించడానికే వెళ్లాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల చరిత్ర కూడా అందరికీ తెలియాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లు అప్పు తెచ్చారన్నారు. 11.5 వడ్డీతో 14 ఏళ్లకు కేసీఆర్ అప్పు తెచ్చాడని.. యూబీఐ, నాబార్డు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టారన్నారు. అసలు, వడ్డీలు కలిపి ఇప్పటివరకు రూ.49,835 కోట్లు చెల్లించామని.. ఇంకా రూ.60,769 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘నేను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు. ఢిల్లీకి నేను ఎందుకు పోతున్నా. కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటు 7.25కి కుదించడం జరిగింది. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకు బిగ్ బ్రదర్. జెండా అజెండా వేరు. కానీ ఆయన ప్రధాని.. మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి భేషజాలు ఎందుకు. ఇతర దేశాలకు ఎందుకు వెళుతున్నా.. పెట్టుబడి దారులను కలవడానికే. పరిశ్రమలు పెట్టండి అని అడిగితే తప్పేంటి?. ప్రధానిని కలిస్తే తప్పా?. 14 ఏళ్లు కట్టాల్సిన డబ్బులు.. 30 ఏళ్లు కడతా అని ఒప్పించుకున్నా. 13 వేల కోట్లు నాకు ఏడాదికి మిగులుతాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
Also Read: CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!
‘వందల ఎకరాల ఫామ్ హౌస్లు, పేపర్లు, టీవీలు ఎక్కడి నుంచి వచ్చాయి. లక్ష కోట్ల ఆస్తి ఎట్లా వస్తుంది. ఆ టెక్నిక్ ఏందో చెప్పండి కాస్త తెలంగాణ యువతకు. మీ పిల్లలకే ఆ నైపుణ్యం ఎలా వచ్చింది?. సీఈ దగ్గరే వందల కోట్లు ఉంటే.. సీఎం దగ్గర ఆస్తి ఎంత ఉంది అని బీజేపీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. మా దగ్గర కొలిచేందుకు టేపు లేదు.. అందుకే విచారణ కమిషన్. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావుల అవినీతి దుర్మార్గాలను చూస్తూ కూర్చున్నాడు ఈటల రాజేందర్. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం అంశంలో ఈటల కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!