CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- నర్సంపేటపై వరాల జల్లు
- రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- బీఆర్ఎస్ ఈ పదేళ్లలో భారీగా ఆస్తులు సంపాదించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటిస్తున్నారు. రేవంత్ తో సహా వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వరంగల్ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు సీఎం రేవంత్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్సంపేటపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. రూ.532.24 కోట్లతో నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.
Also Read
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
శంకుస్థాపన పనుల వివరాలు:
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.17.28 కోట్లతో నర్సంపేట- పాఖాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ. 20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Also Read:Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
అనంతరం బహిరంగసభలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఈ పదేళ్లలో భారీగా ఆస్తులు సంపాదించారు.. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. వరికి ప్రోత్సాహకాలిచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మా పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు ఫాంహౌస్ లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు.. ఉద్యమగడ్డ వరంగల్ కు మాత్రం ఏమీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.. 3 కోట్ల 10 లక్షల మందికి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదవాళ్లకు ఇచ్చారు.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి పేదల్ని మోసం చేశారు.. పేదల ఆత్మ గౌరవం పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కు ఏమేమి ఉన్నాయో వరంగల్ కు కూడా అవే తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మార్చి 31 లోపల వరంగల్ లో ఎయిర్ పోర్టును ప్రారంభించుకుంటామన్నారు. వరంగల్ లో అండర్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించుకుంటాం.. సౌర విద్యుత్ ని ఉత్పత్తి చేసే బాధ్యతను మహిళలకు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!