Putin: ‘‘చమురు, అణు శక్తి, నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్, సైన్యం’’.. పుతిన్ స్పీచ్లో కీలక అంశాలు ఇవే..
- భారత్కు నిరంతర చమురు సరఫరాకు సిద్ధం..
- భారత సైన్యం ఆధునీకీకరణలో రష్యా పాత్ర..
- కుడంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై కామెంట్స్..
- పుతిన్ స్పీచ్లో కీలక అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: గత ఐదు దశాబ్ధాలుగా భారత సైనిక ఆధునీకీకరణలో రష్యా కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. వైమానిక రక్షణ, వాయుసేన, నౌకాదళ రంగాల్లో భారతదేశానికి అత్యాధుని సాంకేతికత అందిస్తున్నామని చెప్పారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన పుతిన్, ఈ రోజు(డిసెంబర్ 5) సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత, రష్యా సంబంధాలను కొనియాడారు. భారతతో జరిపిన చర్చల ఫలితాలపై తాము పూర్తిగా సంతృప్తి చెందినట్లు వెల్లడించారు. పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం రష్యా నిరంతరం ఇంధనాన్ని రవాణా చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
Read Also: Vladimir Putin Fitness: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి.. 73 ఏళ్ల వయసులో కూడా..
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
భారతదేశంలో అతిపెద్ద అణు కర్మాగారాన్ని నిర్మించే ప్రాజెక్టుపై కూడా రష్యా పనిచేస్తోందని, తమిళనాడులోని కడంకుళం అణు విద్యుత్ కేంద్రం గురించి మాట్లాడారు. ఇప్పటికే ఆరు రియాక్టర్లలో రెండింటిని గ్రిడ్లో అనుసంధానించామని, మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. ఇది భారత దేశానికి తక్కువ ఖర్చుతో క్లీన్ ఎనర్జీని ఇస్తుందని చెప్పారు. దీనికి తోడు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఫ్లోటింగ్ అణు విద్యుత్ కేంద్రాలు, వైద్యం-వ్యవసాయ రంగాల్లో అణు సాంకేతిక వినియోగంపై భారత్తో రష్యా సహకారం పెరుగుతుందని పుతిన్ చెప్పారు. గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ 12శాతం పెరిగిందని ఇది 64 బిలియన్ డాలర్లు అని, దీనిని 100 బిలియన్ డాలర్లకు పెంచేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ విస్తరణతో రవాణా, వాణిజ్య రంగాల్లో కొత్త అవకాలు పెరుగుతాయని పుతిన్ చెప్పారు. భారత్ రష్యా వాణిజ్యంలో 96 శాతం రూపీ-రూబుల్ ద్వారా జరుగుతోందని, త్వరలో యూరేసియన్ ఎకనామిక్ యూనియన్-భారత్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉందని పుతిన్ అన్నారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపడుతోందని, భారతీయ స్నేహితులకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని పుతిన్ చెప్పారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!