Bharat Future City: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్.. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమిపూజ..
- భారత్ ఫ్యూచర్ సిటీకి నూతన ఉత్సాహం
- గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమిపూజ.
- భవిష్యత్ హైదరాబాద్కు కొత్త దారి..
- ORR నుంచి RRR వరకు నేరుగా ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Future City: రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంత భవిష్యత్తు హైదరాబాద్కు కేంద్రంగా మారబోతోంది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ మహానగరానికి మరిన్ని కీలక ప్రాజెక్టులతో కొత్త ఉత్సాహం వస్తోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ఊపందుకుంటున్న వేళ, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మరిన్ని నిర్మాణాలకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
భవిష్యత్తు నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం FCDA (ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ)కి అప్పగించింది. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు, ఇప్పుడు దాని కార్యాలయాన్ని నగర నడిబొడ్డున కాకుండా, ఫ్యూచర్ సిటీలోనే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీర్ఖాన్ పేటలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.19 కోట్లతో FCDA కార్యాలయం రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు, మరో 20 ఎకరాల్లో NIUIM (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయానికి కూడా స్థలం కేటాయించారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
IND vs PAK: ఎవరి చేతికి ట్రోఫీ? ముచ్చటగా మూడోసారి.. ఫైనల్లో పాకిస్థాన్తో భారత్ఢీ..
ఇక భారత్ ఫ్యూచర్ సిటీని వివిధ ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునేందుకు వీలుగా, ‘రతన్ టాటా రోడ్డు’ పేరిట గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. 300 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల ఈ రోడ్డు రెండు దశల్లో రూపుదిద్దుకోనుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డులోని ఆమనగల్లు వరకు ఇది విస్తరిస్తుంది. ఇందులో భాగంగా మొదటి దశలో భాగంగా.. రావిర్యాల (టాటా ఇంటర్చేంజ్) నుంచి మీర్ఖాన్ పేట వరకు 19.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1,665 కోట్లు కేటాయించారు. ఇక రెండో దశలో భాగంగా మీర్ఖాన్ పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.2,365 కోట్లు మంజూరు చేశారు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్తో పాటు బెంగళూరు, నాగార్జున సాగర్, విజయవాడ రహదారుల నుంచి ఫ్యూచర్ సిటీకి నేరుగా చేరుకోవడం సులభతరం అవుతుంది. ఇక నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు కీలక ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అధికార యంత్రాంగం ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Off The Record : జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటనతో బీఆర్ఎస్ లో అలకలు
తాజావార్తలు
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!