CM Revanth Reddy: భూభారతి పోర్టల్ను ప్రజలకు అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- భూ భారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
- రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్
- పోరాటాల నుంచే రెవెన్యూ చట్టాలు వచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ భారతీ ప్రజలకు అంకితం చేస్తున్నాం.. సంతోషంగా ఉంది.. భూమి కోసమే ఎన్నో ఉద్యమాలు వచ్చాయి..
Also Read:Lady Aghori: యో* పూజ చేస్తానని మోసం… లేడి ప్రొడ్యూసర్ కి 10 లక్షల టోకరా..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
పోరాటాల నుంచే రెవెన్యూ చట్టాలు వచ్చాయి.. రెవెన్యూ వ్యవస్థ ఉన్నది దోచుకోవడానికి అని చిత్రీకరించే పని గత ప్రభుత్వం చేసింది.. ఉన్న ఫలంగా ధరణి వచ్చిన తర్వాతనే.. రెవెన్యూ వాళ్ళు దొంగలు.. దోపిడి దారులుగా కనిపించారా..?ఎక్కడైనా కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు.. అంత మాత్రానా అందరిని అంటామా.. ఇంట్లో ఎలుక వస్తె.. ఇల్లు తగలబెట్టుకుంటామా.. గత ప్రభుత్వం చట్టాలు మార్చి.. కొందరికి చుట్టాలుగా మార్చింది.. మన చట్టం పేదలకు బంధువుగా ఉండాలి.. భూ భారతీ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.. ఆనాడు తెచ్చిన ధరణి తెలంగాణ ప్రజలకు పీడకలగా మారింది.. రెవెన్యూ సిబ్బందిపై నెపం వేసి లబ్ధి పొందాలని చూశారు.. మొదటి విడత నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేద్దాం..
Also Read:SIT Raids: మూడు చోట్ల సిట్ సోదాలు.. దొరకని కసిరెడ్డి ఆచూకీ
కలెక్టర్ ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టాలి.. సమస్యలు పరిష్కారం చేయాలి.. చట్టాలు చేసేంత వరకు మా బాధ్యత.. అమలు చేసేది రెవెన్యూ అధికారులే.. అందుకే మీ సమక్షంలో భూ భారతీ పోర్టల్ ప్రారంభించాము.. రెవెన్యూ సిబ్బందిని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం.. దొంగలు ఉంటే వాళ్ళ పట్ల కటినంగా ఉంటాం.. మీకు సోదరుడిగా ఉంట.. మేము చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా చేసే పనికి నేను వ్యతిరేకం.. అక్కడో ఇక్కడో .. ఉంటారు తప్పులు చేసే వాళ్ళు.. వాళ్ళ పట్ల కటినంగా ఉంట.. గత ముఖ్యమంత్రి మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించారు.. ఇదెక్కడి పద్ధతి.. ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా ఉంచండి..
Also Read:LSG vs CSK: రాణించిన పంత్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
కలెక్టర్ లు.. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం.. మేము.. మీరు వేరు వేరు కాదు.. తెలంగాణ లో రైతులు..రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు.. ఆధార్ మనిషికి.. భూమికి భూదార్.. ప్రతి భూమికి కార్డు ఇస్తాం.. కొలతలు వేసి.. సరిహద్దులు గుర్తిద్దాం.. తెలంగాణ హద్దునే నిర్ణయించిన రెవెన్యూ వాళ్ళు.. భూముల హద్దులు గుర్తించలేరా..?.. మనం ఏ తప్పు చేయొద్దు.. రైతులు మనం ఊరికి వెళ్తే ఇంత భోజనం పెట్టీ పంపేలా పని చేయండి.. కలెక్టర్ లు ప్రతీ మండలం పర్యటన చేయాల్సిందే.. అందరీ సహకారం తీసుకుని పని చేయండి” అని సీఎం రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!