CM Revanth Reddy : ఎల్బీనగర్కు వస్తే నా గుండె వేగం పెరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్బీనగర్ నుంచి హయత్నగర్కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో చేదు అనుభవం ఎదురైనా…మీరు నన్ను ఆదరించారన్నారు. ఎల్బీ నగర్ లో నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి మల్కాజిగిరి ఎంపీ గా గెలిపించారన్నారు. మీ అభిమానం తోనే తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యానని, ఎల్బీ నగర్ కు వస్తే నా గుండె వేగం పెరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ నా సొంత బంధువులు, అభిమానులు ఎక్కువ గా ఉంటారని, హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంలో మెట్రోరైలు ను విస్తరిస్తామని, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వైపు, మియాపూర్ నుంచి రామచంద్ర పురం వైపు మెట్రో ను పొడగిస్తామన్నారు. 40 నుంచి 50 వేల కోట్ల తో మురికి కూపంలో మూసి ని ప్రక్షాళన చేస్తామన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కాంగ్రెస్ నిర్మించింది కాబట్టే… ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కు పేరు వచ్చిందన్నారు. ఓటర్ లోపల ఉన్న నగరం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వైబ్రాంట్ 2050 పేరుతో మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని, రాబోయే 100 సంవత్సరాలకు సరిపోయే అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి సహకరించవద్దు అని ఒకాయన కేంద్రానికి చెప్పారని, అలా చేస్తే మిమ్మల్ని నగర బహిష్కరణ చేస్తామన్నారు. ఈ నెల 11 న ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్ట బోతున్నామని, భద్రాచలం లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ఫ్లై ఓవర్ లు నిర్మిస్తున్నామని, రాబోయే కాలంలో నగరం నాలుగు వైపులా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ 2050 ప్రణాళిక ను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన తెలిపారు.
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!