CM Revanth Reddy: వీరుల గడ్డలో విద్రోహులు షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్..
- మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో సీఎం ప్రసంగం
- అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధాని మోడీ నిలుస్తారు- సీఎం
- యోధులు నేలలో ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేడ్కర్, బాలా సాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు నేలలో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు గుజరాత్ గులాంలుగా మారారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అనంతరం సోలాపూర్లో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆటో డ్రైవర్గా ఉన్న ఏక్నాథ్ షిండేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువచ్చిందని.. సొంత కుమార్తెను కాదని అజిత్ పవార్ను శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి చేశారని.. అశోక్ చవాన్ ఆయన తండ్రి శంకర్ రావు చౌహాన్ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులుగా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్కు చేరుకున్న భారత్
Also Read
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్తో వస్తున్న SUV
ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ. 18 వేల కోట్లను రైతుల రుణమాఫీకి వారి ఖాతాల్లో వేసిందని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ను గెలిపిస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మీనల్ పాటిల్ ఖత్గావ్కర్, భోకర్ అభ్యర్థి తిరుపతి కదమ్ కొందేకర్, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేతన్ నరొటే, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌహాన్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also: Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
తాజావార్తలు
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!