CM Revanth Reddy: వీరుల గడ్డలో విద్రోహులు షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్..
- మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో సీఎం ప్రసంగం
- అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధాని మోడీ నిలుస్తారు- సీఎం
- యోధులు నేలలో ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేడ్కర్, బాలా సాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు నేలలో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు గుజరాత్ గులాంలుగా మారారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అనంతరం సోలాపూర్లో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆటో డ్రైవర్గా ఉన్న ఏక్నాథ్ షిండేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువచ్చిందని.. సొంత కుమార్తెను కాదని అజిత్ పవార్ను శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి చేశారని.. అశోక్ చవాన్ ఆయన తండ్రి శంకర్ రావు చౌహాన్ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులుగా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్కు చేరుకున్న భారత్
Also Read
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ. 18 వేల కోట్లను రైతుల రుణమాఫీకి వారి ఖాతాల్లో వేసిందని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ను గెలిపిస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మీనల్ పాటిల్ ఖత్గావ్కర్, భోకర్ అభ్యర్థి తిరుపతి కదమ్ కొందేకర్, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేతన్ నరొటే, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌహాన్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also: Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!