CM Revanth Reddy: వీరుల గడ్డలో విద్రోహులు షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్..
- మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో సీఎం ప్రసంగం
- అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధాని మోడీ నిలుస్తారు- సీఎం
- యోధులు నేలలో ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేడ్కర్, బాలా సాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు నేలలో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు గుజరాత్ గులాంలుగా మారారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అనంతరం సోలాపూర్లో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆటో డ్రైవర్గా ఉన్న ఏక్నాథ్ షిండేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువచ్చిందని.. సొంత కుమార్తెను కాదని అజిత్ పవార్ను శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి చేశారని.. అశోక్ చవాన్ ఆయన తండ్రి శంకర్ రావు చౌహాన్ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులుగా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్కు చేరుకున్న భారత్
Also Read
ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ. 18 వేల కోట్లను రైతుల రుణమాఫీకి వారి ఖాతాల్లో వేసిందని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ను గెలిపిస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మీనల్ పాటిల్ ఖత్గావ్కర్, భోకర్ అభ్యర్థి తిరుపతి కదమ్ కొందేకర్, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేతన్ నరొటే, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌహాన్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also: Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
తాజావార్తలు
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!