CM Revanth Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక చర్చలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్, అమిత్ షా లతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీల్లో ఆయన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో విస్తృత చర్చలు జరపనున్నారు. ఇందులో ముఖ్యంగా..
Read Also:Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ, మూసీ నది పునర్జీవన ప్రాజెక్ట్, ఎరువుల కొరత వంటి రాష్ట్రానికి ప్రాధాన్యమున్న అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, నిన్న కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. యువతలో క్రీడా శక్తిని అభివృద్ధి చేయాలని, క్రీడలతో పాటు క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కూడా సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చించారు. యువతలో క్రీడా ఆసక్తిని పెంపొందించేందుకు ఇది కీలకం అవుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం క్రీడలు మాత్రమే కాకుండా, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా సీఎం రేవంత్ దృష్టి సారించారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటు గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. మొత్తంగా ఈ ఢిల్లీ పర్యటన ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రంగాల్లో సహకారం పొందే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!