CM Revanth Reddy: నిజామాబాద్ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని, చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో వంద మంది నామినేషన్లు వేశారన్నారు. 2019 లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని, ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడంటూ సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతులను ఆదుకుంటామన్నందుకు అర్వింద్ ను గెలిపించారని, మళ్లీ గెలిపించండి పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ ఇప్పుడు చెపుతున్నాడన్నారు. ఈ ప్రాంత రైతులంటే లెక్క లేదు.. మోసం చేయవచ్చునని మోదీ, ధర్మపురి అర్వింద్ అనుకుంటున్నారని, నిజామాద్ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి 150 రోజులైంది.. కేంద్రం నుంచి ఏం తెచ్చాడు..? కేంద్రంతో మాట్లాడి ఆర్మూర్ మున్సిపాలిటీ కి మున్సిపల్ కార్యాలయం కూడా తేలేదు.. ఆర్మూర్ లో బీజేపీకి వేసిన ఓట్లు శుద్ధ దండగ అవుతాయి..
రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకువచ్చిన నరేంద్ర మోదీ మెడలు వంచి క్షమాపణ చెప్పించిన పౌరుషం పంజాబ్ రైతులది.. తెలంగాణలో ఆర్మూర్ , నిజామాబాద్ రైతులు కూడా పంజాబ్ రైతుల్లా కొట్లాడుతారు… పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాలన్నా జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 47 కోట్లు బకాయిలు విడుదల చేసి చక్కెర కర్మాగారాన్ని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనే బాధ్యత నాది.. 9 వ తేదీ లోపు రైతు బంధు వేస్తా.. లేక పోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేసిన… 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు వేశాం.. కేసీఆర్ సిగ్గుంటే అమరవీరుల స్థూపం లేకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి.. కేసీఆర్.. రైతు బంధు వచ్చిందో రాలేదో ఏ రైతు ఖాతానైనా చూడు..
Also Read
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అంటే హరీష్ రావు రాజీనామా సవాల్ చేశాడు.. రుణమాఫీ చేసి సిద్దిపేట కు పట్టిన శనిశ్వరుడిని శాశ్వతంగా వదిలిస్తా.. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా… దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు.. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీ కి అవకాశం ఇచ్చారు..ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి… ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం 16 కోట్లు మంజూరు .. రాముడు కళ్యాణం కాకుండా ఎక్కడైనా అక్షింతలు పంచుతారా..? రాముని కళ్యాణానికి 15 రోజులకు ముందే బీజేపీ వాళ్లు అక్షింతలు పంచారు.. ఇది దేవుని మోసం చేయడం కాదా.. .. హిందులను మోసం చేసినట్లు కాదా.. బీజేపీ వాళ్లు మనకు భక్తి, పూజల గురించి చెపుతారా..? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారు బిక్షగాడు అవుతాడు..’ అని సీఎం రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!