Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Comments On Bjp And Brs

CM Revanth Reddy: నిజామాబాద్ రైతుల పరిస్థితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది

Published Date :May 8, 2024 , 10:59 pm
By Gogikar Sai Krishna
CM Revanth Reddy: నిజామాబాద్ రైతుల పరిస్థితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని, చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో వంద మంది నామినేషన్లు వేశారన్నారు. 2019 లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని, ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడంటూ సీఎం రేవంత్‌ విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతులను ఆదుకుంటామన్నందుకు అర్వింద్ ను గెలిపించారని, మళ్లీ గెలిపించండి పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ ఇప్పుడు చెపుతున్నాడన్నారు. ఈ ప్రాంత రైతులంటే లెక్క లేదు.. మోసం చేయవచ్చునని మోదీ, ధర్మపురి అర్వింద్ అనుకుంటున్నారని, నిజామాద్ రైతుల పరిస్థితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి 150 రోజులైంది.. కేంద్రం నుంచి ఏం తెచ్చాడు..?  కేంద్రంతో మాట్లాడి  ఆర్మూర్ మున్సిపాలిటీ కి  మున్సిపల్ కార్యాలయం కూడా తేలేదు.. ఆర్మూర్ లో బీజేపీకి వేసిన ఓట్లు శుద్ధ దండగ అవుతాయి..
రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకువచ్చిన నరేంద్ర మోదీ మెడలు వంచి క్షమాపణ చెప్పించిన పౌరుషం పంజాబ్ రైతులది..  తెలంగాణలో ఆర్మూర్ , నిజామాబాద్ రైతులు కూడా పంజాబ్ రైతుల్లా కొట్లాడుతారు… పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాలన్నా జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి..  మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 47 కోట్లు బకాయిలు విడుదల చేసి చక్కెర కర్మాగారాన్ని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం..  500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనే బాధ్యత నాది..  9 వ తేదీ లోపు రైతు బంధు వేస్తా.. లేక పోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేసిన…  69 లక్షల మంది రైతుల అకౌంట్లలో  రైతు బంధు నిధులు వేశాం..  కేసీఆర్ సిగ్గుంటే అమరవీరుల స్థూపం లేకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి..    కేసీఆర్.. రైతు బంధు వచ్చిందో రాలేదో   ఏ రైతు ఖాతానైనా చూడు..

Also Read

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

 

ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అంటే హరీష్ రావు రాజీనామా సవాల్ చేశాడు..  రుణమాఫీ చేసి సిద్దిపేట కు పట్టిన శనిశ్వరుడిని శాశ్వతంగా వదిలిస్తా.. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా…  దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు..  నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీ కి అవకాశం ఇచ్చారు..ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి…  ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం 16 కోట్లు మంజూరు ..  రాముడు కళ్యాణం కాకుండా ఎక్కడైనా అక్షింతలు పంచుతారా..?  రాముని కళ్యాణానికి 15 రోజులకు ముందే బీజేపీ వాళ్లు అక్షింతలు పంచారు.. ఇది దేవుని మోసం చేయడం కాదా.. .. హిందులను మోసం చేసినట్లు కాదా.. బీజేపీ వాళ్లు మనకు భక్తి, పూజల గురించి చెపుతారా..?  దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారు బిక్షగాడు అవుతాడు..’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • CM Revanth Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

  • Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions