CM KCR : తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును గత పాలకులు, నాయకులు చాలా మంది అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇన్నాళ్లు అడ్డుకున్నారని, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు పాలమూరుపై విమర్శలు చేశారన్నారు. మూడు ప్రాజెక్టులు పూర్తైతే దేశానికే తెలంగాణ అన్నం పెడుతుందని, తెలంగాణలో మనకు రావాల్సిన నీటి వాటాలను లెక్కగట్టి మూడు ప్రాజెక్టుల పనులను ప్రారంభించామన్నారు సీఎం కేసీఆర్.
Also Read : Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారని, పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ, కృష్ణాలో నీటి వాటాలు తేల్చలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరుకు నీళ్లు అడిగితే కేంద్రం ఏం చేసింది? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణా ట్రిబ్యునల్లో నీటి వాటాలు తేల్చాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. మాకు ఎవరి వాటాలు అక్కర్లేదు, మంది సొమ్ము అవసరం లేదు.. సీఎంలు దత్తత తీసుకున్నా పాలమూరుకు న్యాయం జరగలేదని, తెలంగాణ నీటి వాటా తేల్చాలంటే ప్రధాని మోడీ స్పందించలేదన్నారు.
Also Read : CM KCR: పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు..
అంతేకాకుండా.. ‘కృష్టా ట్రిబ్యునల్కు లేఖ రాసేందుకు పదేళ్ల సమయం సరిపోలేదా?.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేటాయించండి.. బీజేపీ జెండాలు పట్టుకుని ఎవరైనా వస్తే ప్రజలు నిలదీయాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా..?.. సీఎం డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ మారింది.. విద్యా, వైద్యం, విద్యుత్ రంగంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాం.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!