MLA Laxma Reddy : మహబూబ్నగర్లో 14 సీట్లు గెలిచి కేసీఆర్కి కానుకగా ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి నికార్సైన నాయకుడు… ఉద్యమంలో నా వెంటే ఉన్నాడన్నారు. జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్ గా మారుస్తానన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టుదల గల నాయకుడని ఉద్యమంలో తన వెంటే ఉంటూ తాను రాజీనామా చేసిన భయపడకుండా వెనకడు వేయకుండా రాజీనామా సమర్పించిన నికార్సైన నేత Dr.సి.లక్ష్మారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
Also Read : IND vs BAN: బంగ్లాతో మ్యాచ్లో స్పెషల్ ప్లాన్స్ లేవు.. మాకు క్లారిటీ ఉంది..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
జడ్చర్ల ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని తండాలను పంచాయతీలు చేశామని, సెజ్ ఏర్పాటుతో వేలాదిమందికి ఉపాధి దొరికిందని చెప్పారు. జడ్చర్లను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదంటూ కేసీఆర్ చెప్పడంతో సభ ఒక్కసారిగా ఈలలతో హర్షద్వానాలతో దద్దరిల్లిపోయింది. ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణ జనాభా లక్ష వరకు ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేయాలని కోరడంతో సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తక్షణమే హామీలు అమలయ్యేలా చేస్తానని తెలిపారు. హైదరాబాద్ కు జడ్చర్ల సమీపంలో ఉన్నందున జడ్చర్లను ఐటీ, పరిశ్రమల హబ్ గా మారుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ కు నీళ్లు అందించి జడ్చర్ల నియోజకవర్గంలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా.. మహబూబ్నగర్లో 14 సీట్లు గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
Also Read : Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!