MLA Laxma Reddy : మహబూబ్నగర్లో 14 సీట్లు గెలిచి కేసీఆర్కి కానుకగా ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి నికార్సైన నాయకుడు… ఉద్యమంలో నా వెంటే ఉన్నాడన్నారు. జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్ గా మారుస్తానన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టుదల గల నాయకుడని ఉద్యమంలో తన వెంటే ఉంటూ తాను రాజీనామా చేసిన భయపడకుండా వెనకడు వేయకుండా రాజీనామా సమర్పించిన నికార్సైన నేత Dr.సి.లక్ష్మారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
Also Read : IND vs BAN: బంగ్లాతో మ్యాచ్లో స్పెషల్ ప్లాన్స్ లేవు.. మాకు క్లారిటీ ఉంది..!
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
జడ్చర్ల ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని తండాలను పంచాయతీలు చేశామని, సెజ్ ఏర్పాటుతో వేలాదిమందికి ఉపాధి దొరికిందని చెప్పారు. జడ్చర్లను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదంటూ కేసీఆర్ చెప్పడంతో సభ ఒక్కసారిగా ఈలలతో హర్షద్వానాలతో దద్దరిల్లిపోయింది. ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణ జనాభా లక్ష వరకు ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేయాలని కోరడంతో సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తక్షణమే హామీలు అమలయ్యేలా చేస్తానని తెలిపారు. హైదరాబాద్ కు జడ్చర్ల సమీపంలో ఉన్నందున జడ్చర్లను ఐటీ, పరిశ్రమల హబ్ గా మారుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ కు నీళ్లు అందించి జడ్చర్ల నియోజకవర్గంలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా.. మహబూబ్నగర్లో 14 సీట్లు గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
Also Read : Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!