CM KCR : రాక్షసుల కుట్రను బద్దలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. ఇటీవల మొయినాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది.. చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది.. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేశారు.. దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు… మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటిదాకా ఆగాను… ఇప్పుడు షో చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటికే ఫామ్హౌస్ ఫైల్స్ పంపించామని, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతాను.. దేశంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు వీడియోలను పంపుతున్నామన్నారు సీఎం కేసీఆర్. 8 ఏండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చి దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది.
Also Read :Live : సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్
రూపాయి పడిపోయిందని, నిరుద్యోగం తాండవిస్తుందని, ఆకలి రాజ్యంగా మారుతోంది ఇండియా అని సీఎం కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ సూచికలు మంచి చెడును చూపిస్తున్నాయని, దేశ విభజన, ప్రజలను విభజించడం.. భారత ప్రజాస్వామ్య నాడీని కలుషితం చేస్తున్నాయని, చాలా దారుణమైన పద్ధతుల్లో పోతున్నారన్నారు. నేను కూడా బాధకు గురయ్యాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రాక్షసుల కుట్రను బద్దల కొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నామన్నారు సీఎం కేసీఆర్.
ఈ రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో వెయిట్ చేశామని, మునుగోడులో కూడా వెకిలి ప్రయత్నాలు చేశారని, చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్రచారాలు చేశారన్నారు సీఎం కేసీఆర్.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..