Munugode Mla: కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల..ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూసుకుంట్ల సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ., సిఎం కెసిఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు.
Read Also: Gadwal Nude Video calls Case: గద్వాల్ న్యూడ్ వీడియో కాల్స్ కేసులో ట్విస్ట్
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఈ సందర్భంగా కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించి దీవించారు.మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జి. జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు పలుపురు పార్టీ నేతలు సిఎం కెసిఆర్ ను కలిసారు. సిఎం ను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునిత, బొల్లం మల్లయ్య యాదవ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, పైల్ల శేఖర్ రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం.సి కోటిరెడ్డి, పార్టీ నేత సోమా భరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి, చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడె రాజీవ్ సాగర్, ఎ. సందీప్ రెడ్డి, మందాడి సైదిరెడ్డి చాడా కిషన్ రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, శంకర్ తదితరులున్నారు.
Read Also: MLC Pochampally Srinivas Reddy: సరంపేటలో పూర్తి మెజారిటీ.. కేసీఆర్ అభినందనలు
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!