Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr About Dharani Portial In Medak Public Meeting

CM KCR: ధరణి తీసేస్తా అన్నోడిని బంగాళాఖాతంలో వెయ్యాలి..

Published Date :August 23, 2023 , 7:01 pm
By NTV WebDesk
CM KCR: ధరణి తీసేస్తా అన్నోడిని బంగాళాఖాతంలో వెయ్యాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇక, సీఎస్ఐ చర్చ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రగతి శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. మెదక్ కి రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే, రామాయంపేట్ ను రెవెన్యూ డివిజన్ చేస్తామని పేర్కొన్నారు. ఏడు పాయల ఆలయానికి అభివృద్ధి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామానికి 15 లక్షల నిధులు కేటాయిస్తున్నాం.. మెదక్ మున్సిపాలిటికి రూ.50 కోట్లు.. మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

వడ్ల కల్లాలు లేచినప్పుడు అడుక్కు తినే వాళ్ళు వస్తారు.. అందరి మాట విని ఆగం కావద్దు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటుంది.. 50 ఏళ్లు మీరే పాలించారు ఇంకా ఒక్క చాన్స్ ఎందుకు.. సింగూరు ప్రాజెక్టుని హైదరాబాద్ కి దత్తత ఇచ్చి మన మెదక్ జిల్లాకి ఎండబెట్టారు.. ఇప్పుడు మన నీళ్లు మనమే వాడుకుంటున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ రాక ముందు చెట్టుకు ఒకడు పుట్టకు ఒకడు అయ్యాం.. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయింది.. బావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ. 25 వేల కోట్లు నష్టం బీజేపీ కలిగించింది అని కేసీఆర్ ఆరోపించాడు.

Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం

కర్ణాటకలో గెలిచిన కంగ్రెస్ తెల్లరే దుకాణం బంద్ చేసింది అని సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏనాడు మంచి నీళ్ళు ఇయ్యలే.. మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం.. ఒక కోటి 3 లక్షల మందికి నల్ల కనెక్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పేర్కొన్నారు. వాళ్లకు రాష్ట్రం అప్పగిస్తే ఆగం అవుతాం.. కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.

Read Also: Etela Rajender: తెలంగాణలో ప్రజల కష్టాలు పోవాలంటే ఆయన ఇంటికి పోవాల్సిందే..!

రైతు భీమా ఇచ్చే ఏకైక రాష్టం తెలంగాణ.. వడ్లు అమ్మితే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసి ఇబ్బంది పెట్టింది.. అయినా రుణమాఫీ చేసినం.. ధరణి తీసేస్తా అన్నోడిని బంగాళాఖాతంలో కలపాలి.. మహారాష్ట్ర రైతులు కూడా తెలంగాణ తరహా పాలన కోరుకుంటున్నారు.. ఒకడు మీటర్ పెట్టాలి అంటాడు.. ఇంకొకడు 3 గంటల కరెంట్ చాలు అంటాడు.. వ్యవసాయం చేసిన మొహామేనా నీది.. మూడు గంటల సరిపోతదా.. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Raashii Khanna: ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం

ఆనాడు 200 పెన్షన్ ఇచ్చినోడు.. ఇప్పుడు 4000 పెన్షన్ ఎలా ఇస్తారు అని కేసీఆర్ అడిగారు. ఇచ్చే మొఖమేన నీది.. చెప్పాలంటే ఎన్నో చెప్పవచ్చు.. రైతుల ఆత్మహత్యలు లేవు.. ఇండియాలో మనమే నెంబర్-1.. పదేళ్ల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇయ్యలా ఎట్లున్నది గమనించాలి.. మన పథకాలు ఇతర రాష్ట్రాల్లో కావాలని అడుగుతున్నారు.. సిద్దిపేట ఎలా ఉందో మెదక్ కూడా అలా కావాలి.. మోసకరుల మాటలు నమ్మి మోసపోవద్దు అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • cm kcr
  • dharani portial
  • medak
  • Public Meeting

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions