CM Jagan: రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ రేపు విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలిస్తున్నారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నంబర్ – 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ – 2 ఫార్ములేషన్ బ్లాక్ను, ఎల్.ఎస్.పి.ఎల్ యూనిట్ – 2ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Read Also: BRS Manifesto: బీ-ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. మిగతావి రేపు అందిస్తాం..
Also Read
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
సీఎం జగన్ రేపు ఉదయం గన్నవరంలో బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధురవాడ ఐటీ హిల్స్కు చేరుకుంటారు. హిల్ నంబరు 3పై దిగి రోడ్డు మార్గంలో హిల్ నంబర్ 2పై ఏర్పాటు చేసిన ‘ఇన్ఫోసిస్’ డెవలప్మెంట్ సెంటర్కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55 గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ సెంటర్ను ప్రారంభించి, ఉద్యోగులతో కాసేపు సీఎం జగన్ ముచ్చటిస్తారు. తిరిగి హెలిపాడ్ దగ్గరకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను ఆరంభిస్తారు. ఆ తరువాత హెలికాప్టర్లో 12.05 గంటలకు బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, ఆ తరువాత ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు.
Read Also: BRS Manifesto Live updates: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్డేట్స్
ఆ తర్వాత సీఈఓ, డైరెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడతారు. కార్యక్రమం 1.10 గంటలకు ముగించుకొని హెలికాప్టర్లో అచ్యుతాపురం మండలంలోని ఏపీఎస్ఈజెడ్కు వెళ్లనున్నారు. అక్కడ 1.30 గంటల నుంచి 1.45 గంటల వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, లారస్ లేబొరేటరీస్కి వెళ్లి యూనిట్-2ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.35 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. అనంతరం హెలికాప్టర్లో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు.
తాజావార్తలు
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
Rhea: సోషల్ మీడియాకు రియా చక్రవర్తి బ్రేక్.. ఎమోషనల్ నోట్ వైరల్!
-
CarryMen: ‘మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం’.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!