CM Jagan Tirupati Tour: తిరుపతిలో జగన్ పర్యటన.. ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈపర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు తరుమల పర్యటనకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుని అక్కడినుంచి రేణిగుంటకు చేరుకున్నారు. సీఎం జగన్కు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలువురు ఘన స్వాగతం పలికారు.

Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
అనంతరం గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారికి సారె ను సమర్పించారు సీఎం జగన్. .తదుపరి అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం తిరుమలకు ప్రయాణం అయ్యారు.
Read Also:బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ ఆంథెమ్’లో ఏముంది?
జగన్ పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తాతయ్య గుంట అమ్మవారి ఆలయ దర్శన సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి కుంకుమ,చందనం బొట్టును స్వయంగా పెట్టారు మంత్రి ఆర్ కె రోజా. గత కొంతకాలంగా పెద్దిరెడ్డి- రోజా మధ్య అంతరం పెరిగింది. ఇద్దరు మంత్రులు సీఎం జగన్ పర్యటనలో ఒక్కటయ్యారని, వీరిద్దరిని అమ్మవారు ఇలా కలిపారని కామెంట్లు వినిపించాయి. అలిపిరి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సీఎం జగన్. తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు టీటీడీచైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.
Read Also: Ginna: జూబ్లీ హిల్స్ హీరో సంగతి తేలుస్తానన్న మంచు విష్ణు!
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!