CM Jagan Stone Attack : సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి అరెస్ట్
గత శనివారం సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్తో పాటు ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్లను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు బృందాలు నిందితుడి కాల్ డేటాను ట్రాక్ చేసి అతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాయి. ఈ కేసులో మరికొందరు కూడా ప్రమేయం ఉన్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
-
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
-
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
-
Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల
-
Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?