CM Jagan : చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో ఒక ముసలాయన సీఎంగా ఉన్నపుడు ఈ పథకాలు ఉన్నాయా.. చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ‘ప్రతీ లబ్ధిదారుడికి పారదర్శకంగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు.. ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశారా.. గతంలో జరగనివి.. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయాలి.. ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో ఎవరు దోచుకున్నారు.. ఎవరు పంచుకున్నారు..
Also Read : PVN Madhav : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఎవరు తిన్నారు.. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ముసలాయాన మాట్లాడడు.. సెల్ఫీ అంటాడు.. నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు.. ఫేక్ ఫోటోలతో సేల్ఫీ ఛాలెంజ్ అంటాడు.. ఛాలెంజ్ అంటే అవికాదు.. ప్రతీ పేదవాడి ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా వల్ల జరిగిన లబ్ది అని చెప్పగలగడం ఛాలెంజ్.. నువ్వు బాగా చేశావయ్యా అని పేదలు అనగలిగితే దాన్ని అంటారు సెల్ఫీ అని.. పేద వాడికి చేసిన మంచి ఎంత చెప్పే సత్తా ఉందా చంద్రబాబు.. నిజాలు దాచి నిందలు, అబద్ధాలు దాచి ప్రచారాలు చేస్తారు.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజాలు అని చెప్పే ప్రయత్నం.. గత పాలనలో వారేం చేశారో చెప్పాలి.. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురించి ఇంటికి స్టిక్కర్ వేసే దైర్యం ఉందా.. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను రోడ్లమీద నిలబెట్టారు.. ఈ మోసాల బాబును గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలి’ అని ఆయన అన్నారు.
Also Read : BRS Athmeeya Sammelanam: ఖమ్మంలో విషాదం.. సిలిండర్ పేలి తెగిపడ్డ కాళ్లు, చేతులు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!