Himanta Biswa Sharma: అస్సాంలో రూ.22 వేల కోట్ల కుంభకోణం.. స్పందించిన సీఎం
- ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం
- స్టాక్ మార్కెట్ పేరుతో ఏకంగా రూ.22 వేల కోట్లకు టోకరా
- స్పందించిన సీఎం హిమంత బిస్వా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. అస్సాంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడ్ని వేల కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్రూఘర్కు చెందిన పుకాన్ తన లగ్జరీ లైఫ్స్టైల్, హై ఫ్రొఫైల్తో అసోం, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ భారీ వరద
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ఈ సైబర్ ఫ్రాడ్ కేసులపై సీరియస్గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. స్పందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించని పెట్టుబడి బ్రోకర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అస్సాం ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అనేక నకిలీ వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయని అనేక మీడియా నివేదికలు చెబుతున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సంస్థలు సెబీ, ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించడం లేదు.
READ MORE:Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్డేట్ ఇదే!
చాలా మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలు డబ్బు పెట్టుబడి పెట్టే వ్యవస్థ లేదన్నారు. ఈ సైబర్ దుండగులు ప్రజలను మోసం చేశారని.. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. “సైబర్ మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను అని ఆయన అన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న మొత్తం రాకెట్ను బయటపెడతామని స్పష్టం చేశారు. పెట్టుబడి నెట్వర్క్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళూరుకు చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!