Himanta Biswa Sharma: అస్సాంలో రూ.22 వేల కోట్ల కుంభకోణం.. స్పందించిన సీఎం
- ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం
- స్టాక్ మార్కెట్ పేరుతో ఏకంగా రూ.22 వేల కోట్లకు టోకరా
- స్పందించిన సీఎం హిమంత బిస్వా శర్మ
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. అస్సాంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడ్ని వేల కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్రూఘర్కు చెందిన పుకాన్ తన లగ్జరీ లైఫ్స్టైల్, హై ఫ్రొఫైల్తో అసోం, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ భారీ వరద
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ సైబర్ ఫ్రాడ్ కేసులపై సీరియస్గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. స్పందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించని పెట్టుబడి బ్రోకర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అస్సాం ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అనేక నకిలీ వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయని అనేక మీడియా నివేదికలు చెబుతున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సంస్థలు సెబీ, ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించడం లేదు.
READ MORE:Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్డేట్ ఇదే!
చాలా మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలు డబ్బు పెట్టుబడి పెట్టే వ్యవస్థ లేదన్నారు. ఈ సైబర్ దుండగులు ప్రజలను మోసం చేశారని.. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. “సైబర్ మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను అని ఆయన అన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న మొత్తం రాకెట్ను బయటపెడతామని స్పష్టం చేశారు. పెట్టుబడి నెట్వర్క్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళూరుకు చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!