CM Chandrababu : ఇలా చేస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.. హత్యలు చేస్తే కాదు?
- స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం
- ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి
- ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చు
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. “ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే రారు.. పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు వస్తారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడంపై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు. ఇది నాకు నచ్చిన పని నేను మనసుపెట్టి పని చేస్తా. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 2025 అక్టోబర్ లోపల ఇది పూర్తి చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఒకపక్క గాలి కలుషితం అవుతోంది, మరోపక్క తాగే నీరు కలుషితం అవుతోంది” అని సీఎం తెలిపారు.
READ MORE: Samsung Galaxy M35 5G: రూ. 24 వేల సామ్సంగ్ ఫోన్.. రూ. 14 వేలకే.. మతిపోయే ఫీచర్లు
Also Read
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ఇంటింటికి వెళ్లి చత్త సేకరణ చేపట్టాలని మున్సిపల్ పరిపాలన విభాగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. “భారతదేశం మొత్తం స్వచ్ఛభారతవైపు అడుగులు వేస్తోంది మనం మొదటి స్థానంలో ఉండాలి. నేను ఎక్కడికి వచ్చి వెళ్లినా మార్పు కనపడాలి. అదే సిబీఎన్ మార్క్. మీ ఇంటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. సోలార్ ప్లాంట్ మీ ఇళ్లపై నిర్మించుకుంటే భారీగా సబ్సిడీ ఇస్తా..
విద్యుత్ వాడకం వల్ల పెట్రోల్ భారం తగ్గుతుంది.. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన సబ్సిడీ ఇస్తా. ఇంటర్నెట్ పెట్టుకోవాలి. రాబోవు రోజుల్లో మీ సెల్ ఫోన్ నుంచి ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్న… వాట్సప్ ద్వారా మీ ఇంటి వద్ద నుంచే మీకు సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్న.. మైదుకూరులో వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం. మైదుకూరును ఓ మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలదే రాజ్యమవుతుంది. అలాంటి రౌడీలు రాకూడదనే నా కోరిక. కడపలో ముఠాలు లేకుండా చేసాం. ప్రజా చైతన్యం పెరిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి.” అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..