CM Chandrababu: పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం..
- పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు..
- పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల..
- గత ఐదేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వరుసగా సమీక్షలు, సమావేశాలు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రా ప్రజల జీవనాడి అయిన పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదిదమే.. కాగా, దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది.. అందులో భాగంగా.. పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు.. గత ఐదేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
Read Also: CM Revanth Reddy: సంస్కరణలతో దేశ ప్రగతిని పీవీ పరుగులు పెట్టించారు..
Also Read
- ROKO: లార్డ్స్ వన్డేలో అరుదైన మైలురాయిని అందుకున్న రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. 20-25 రోజుల్లో శ్వేత పత్రాలు విడుదలను పూర్తి చేస్తాం. ఆ తర్వాత బడ్జెట్ పెడతాం అన్నారు.. ఇరిగేషన్.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రత్యేక వెబ్సైటులో పెడతాం. చెప్పిన తప్పులను వందసార్లు చెప్పి.. ప్రజలను నమ్మించేందురు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.. పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరంగా పేర్కొన్నారు.. ఇలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారాడు అని దుయ్యబట్టారు.. అన్నింటికీ అతీతంగా అందరూ జగన్ చేసిన తప్పులను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో రెండు సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపేశారు. సమర్ధులైన అధికారులను బదిలీ చేసేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. రెండేళ్ల తర్వాత గుర్తించారు. పీపీఏ వద్దని చెప్పినా.. కాంట్రాక్టరును మార్చారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
ROKO: లార్డ్స్ వన్డేలో అరుదైన మైలురాయిని అందుకున్న రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!