CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రీ సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంబాజీపేటలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. నీరు జీవం అయితే, భూమి జీవితం అని పేర్కొన్నారు. కోనసీమ అంటే పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి పరవళ్లు గుర్తుకు వస్తాయని అన్నారు. ఎల్నినో పరిస్థితులు వచ్చినా గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలవడం ఆ జీవనది గొప్పతనానికి నిదర్శనమని సీఎం చెప్పారు.
పాలన అంటే సచివాలయంలో కూర్చోవడం కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెల నాలుగు సార్లు ప్రజల మధ్యకు వెళ్తున్నానని, తనతో పాటు ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించిన సీఎం.. పూర్వీకులు ఇచ్చిన పాస్ పుస్తకాలపై ప్రభుత్వ నేతల ఫొటోలు ముద్రించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగించే గ్రానైట్ రాళ్లను పొలాల్లో ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశామని, భూమికి పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను తొమ్మిదోసారి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని పేర్కొన్న సీఎం.. ఒక్క రూపాయి అవినీతికి కూడా తావులేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ss
తాజావార్తలు
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?