New Year 2025: ఆశలు, ఆశయాలు నేరవేర్చుకుని.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: సీఎం చంద్రబాబు
- రాష్ట్ర ప్రజలకు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు
- బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి
- ఎక్స్ వేదికగా న్యూ ఇయర్ పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నూతన ఏడాది అన్నం పెట్టే అన్నదాతల జీవితంలో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రతిఒక్కరు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
‘రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని జనసేన పార్టీ పేర్కొంది.
Also Read
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని మంత్రి నారా లోకేశ్ ట్వీటారు.
రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర… pic.twitter.com/fH8uDsVjjr
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2025
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో… pic.twitter.com/rRarrDJf9A
— Lokesh Nara (@naralokesh) January 1, 2025
తాజావార్తలు
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!