Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Cm Chandrababu Naidus Key Comments On Hyderabad Development And Amaravati Development

CM Chandrababu: హైటెక్‌ సిటీ రాక ముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..

Published Date :September 12, 2025 , 5:45 pm
By Sudhakar Ravula
  • హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష..
  • ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్న సీఎం చంద్రబాబు..
  • అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ..
  • హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది..
CM Chandrababu: హైటెక్‌ సిటీ రాక ముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వే టూ న్యూస్ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు.. పోలవరం వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం.. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది… అమరావతి రైతులకు అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది. గుంటూరు -విజయవాడ – తెనాలి – గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు..

Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు.. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయని వెల్లడించారు.. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ, నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని తెలిపారు.. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం. నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం అన్నారు చంద్రబాబు.

Read Also: Fire Crakers: బాణాసంచాపై దేశవ్యాప్తంగా నిబంధనలు అమలు చేయాలి

వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు.. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారన్నారు. ఇక, మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు. మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్ధతినే నిర్మాణం చేపడుతున్నాం.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.. నిర్వహణ ప్రభుత్వానిదే. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amaravati development
  • Andhra Pradesh
  • CM Chandrababu Naidu
  • hitech city
  • Hyderabad Development

తాజావార్తలు

  • Gas Discounts: గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు.. మార్చి 31 వరకే అవకాశం..

  • Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!

  • Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..

  • EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…

  • AP East-West Cargo Corridor: ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ.. నూతన పోర్టుల్లో త్వరలోనే ఆపరేషన్లు ..

ట్రెండింగ్‌

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions