CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
- హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష..
- ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్న సీఎం చంద్రబాబు..
- అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ..
- హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది..
CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వే టూ న్యూస్ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు.. పోలవరం వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం.. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది… అమరావతి రైతులకు అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది. గుంటూరు -విజయవాడ – తెనాలి – గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు..
Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు.. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయని వెల్లడించారు.. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ, నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని తెలిపారు.. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం. నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం అన్నారు చంద్రబాబు.
Read Also: Fire Crakers: బాణాసంచాపై దేశవ్యాప్తంగా నిబంధనలు అమలు చేయాలి
వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు.. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారన్నారు. ఇక, మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు. మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్ధతినే నిర్మాణం చేపడుతున్నాం.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.. నిర్వహణ ప్రభుత్వానిదే. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!