CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
- హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష..
- ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్న సీఎం చంద్రబాబు..
- అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ..
- హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వే టూ న్యూస్ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు.. పోలవరం వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం.. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది… అమరావతి రైతులకు అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది. గుంటూరు -విజయవాడ – తెనాలి – గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు..
Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు.. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయని వెల్లడించారు.. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ, నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని తెలిపారు.. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం. నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం అన్నారు చంద్రబాబు.
Read Also: Fire Crakers: బాణాసంచాపై దేశవ్యాప్తంగా నిబంధనలు అమలు చేయాలి
వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు.. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారన్నారు. ఇక, మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు. మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్ధతినే నిర్మాణం చేపడుతున్నాం.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.. నిర్వహణ ప్రభుత్వానిదే. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!