Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu Stresses Leadership Training Grassroots Strengthening And Public Outreach For Tdp Cadre

CM Chandrababu: ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం..

Published Date :December 11, 2025 , 6:34 pm
By Kothuru Ram Kumar
  • ఎన్టీఆర్ భవన్‌లో మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు
  • పార్టీ అధ్యక్షుల నియామకంపై త్వరలో స్పష్టత
  • "కాఫీ కబుర్లు" సమావేశంలో నాయకత్వ నైపుణ్యాలు, శిక్షణ ప్రాముఖ్యతపై చంద్రబాబు చర్చ.
CM Chandrababu: ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు సీఎం వద్ద వినతులు ఇవ్వడంతో కార్యాలయం సందడిగా మారింది. సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంపై కమిటీ కాలయాపన పట్ల వ్యక్తం చేసిన అసంతృప్తిని గుర్తుచేస్తూ, త్వరలోనే నియామకాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో కూడా సీఎం భేటీ అవుతారని తెలిసింది.

స్టైల్, పెర్ఫార్మన్స్, ఫీచర్స్ తో అదరగొట్టడానికి సిద్దమైన కొత్త Kia Seltos.. వేరియంట్ వారీగా ఫీచర్లు ఇవే..!

Also Read

  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..
  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
  • SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
  • US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!

“కాఫీ కబుర్లు” పేరుతో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు స్వయంగా చర్చల్లో పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ సమయంలో చెట్ల నీడలో, ఎర్రటి ఎండలో శిక్షణ నిర్వహించాల్సిన రోజులను గుర్తు చేసుకుంటూ.. ఇప్పటి తరానికి లభిస్తున్న అనుకూల వాతావరణం, ఆధునిక సౌకర్యాలను గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు గుర్తుచేశారు.

అలాగే పార్టీ భావజాలం, సిద్ధాంతాలు ప్రతి కార్యకర్తకు అవగాహన కావాలని చంద్రబాబు సూచించారు. నాయకులు, కార్యకర్తలకు చేరువై, వారిని ప్రేరేపించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల ఓటు బ్యాంక్ టీడీపీకి మెజారిటీగా రావాలంటే కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో సమన్వయం, క్రమశిక్షణ, బలాబలాల విశ్లేషణ ముఖ్యమని, ప్రతి బూత్ బలోపేతం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అక్కడ పార్టీకి అధిక ఓట్లు వస్తాయని గుర్తుచేశారు.

Satya Kumar Yadav: వాజపేయి అడుగుజాడల్లో రాష్ట్రంలో సుపరిపాలన యాత్ర..

గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టామని చెప్పారు. ప్రతిపక్షంలో ఎంత బాగా పని చేశారో.. ఇప్పుడు అధికారంలో మరింత అప్రమత్తంగా, శక్తివంతంగా పనిచేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో పింఛన్లకే ఏటా రూ.33 వేల కోట్లను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కొందరు డబ్బుతోనే ఎన్నికలు గెలవగలమని భావిస్తారని, కానీ ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళితేనే నిజమైన విజయం సాధ్యమవుతుందని సీఎం అన్నారు. పని చేయడం ఒక ఎత్తు, చేసిన పనిని ప్రజలకు చేరవేయడం మరో ఎత్తు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu
  • leadership training TDP
  • NTR Bhavan Amaravati
  • TDP cadre development
  • TDP mandal presidents meeting

తాజావార్తలు

  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

  • IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?

  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!

  • TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..

  • Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions