CM Chandrababu: రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం!
- రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం
- భూమి విలువ పడిపోతుందనే అపోహలు వద్దు
- రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం
అదనపు భూ సేకరణ వల్ల భూమి విలువ పడిపోతుందనే అపోహలు వద్దు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు. రాజధాని పరిధిలో గ్రామ కంఠాల్లో ఉంటూ పట్టాల్లేని వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం అయ్యారు. ఏ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పర్యటనకు రైతులను ఆహ్వానించారు. రాజధాని మరలా అభివృద్ధి బాట పట్టడం ఆనందంగా ఉందని రైతులు సీఎంతో చెప్పారు.
మే 2న రాజధానిలో ప్రధాని మోడీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. రాజధాని పనుల పునః ప్రారంభ సభకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందని సీఎం పేర్కొన్నారు.
Also Read
- Tags
- Amaravati
- ap
- cm chandrababu
- tdp
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!