CM Chandrababu: ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా!
- నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
- ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా
- సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలి, బొగ్గు, నీరు, సోలార్తో విద్యుత్ ఉత్పత్తి కావడం తాను చూశానని.. ఎద్దులను ఉపయోగించి కరెంట్ ప్రొడ్యూస్ చేయడం తొలిసారి చూస్తున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం.. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్కు సీఎం శ్రీకారం చుట్టారు. నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించానని చెప్పారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ.. అందరూ ఆరోగ్యంగా ఉండండని సీఎం సూచించారు. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
‘నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇథనాయిల్ ప్రాజెక్టు, లైఫ్ స్కూల్, గోశాల ప్రారంభం జరగడం సంతోషంగా ఉంది. ఇథనాయిల్ పరిశ్రమ వల్ల రైతులకు మంచి జరుగుతుంది. నూకల ద్వారా పెట్రోల్లో కలిపేందుకు ఇథనాయిల్ తయారు చేస్తారు. ఆవులు, ఎద్దులను కాపాడుకునేలా గోశాల ఏర్పాటు చేశారు. ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేసేలా కొత్త ప్రక్రియ తీసుకువచ్చారు. ఎద్దులను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా. రాష్ట్రంలో ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగయ్యాయి. బ్రెజిల్లో ఒంగోలు జాతి బ్రీడ్ను కాపాడుకుంటూ వస్తున్నారు. వారు ఒంగోలు జాతిని ప్రపంచానికి అందించే పరిస్థితికొచ్చారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండండి. పేద పిల్లలకి నందగోకులం స్కూల్లో మంచి విద్య అందించడం ఆనందంగా ఉంది. ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతిఒక్కరు పి4లో భాగస్వాములు అవ్వాలి. సమాజం నుంచి ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఏదొకటి చేయాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read: AP Fake Liquor: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం.. ఏ1 జనార్దన్ రావు అరెస్ట్!
‘నెల్లూరు జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా 150 టీఎంసీల నీరు ఉంటుంది. కృష్ణపట్నం పోర్టు ఉంది. త్వరలో రామాయపట్నం, దుగ్గరాజుపట్నం రాబోతోంది. జిల్లాలో ఎయిర్పోర్ట్ వస్తుంది. జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. బీపీసీఎల్ కంపెనీ, క్రిప్ కో గ్రీన్ ఎనర్జీ వంటి కంపెనీలు రానున్నాయి. 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుంది. అప్పటికి ఆంద్రప్రదేశ్ ని దేశంలో నంబర్ 1గా మారుస్తాం. గూగుల్ డేటా సెంటర్, ఎఐ విశాఖపట్నంకి రాబోతోంది. హైదరాబాదులో ఐటి ప్రమోట్ చేసాం.. ఏపీ అభివృద్ధి భారీగా జరగబోతోంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!