CM Chandrababu: హైదరాబాద్కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటం సెంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి సాంకేతిక విప్లవం, యువత పాత్ర, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు.
IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. నా ఆశలన్నీ విద్యార్థులపైనే ఉన్నాయి. ఒక చరిత్ర రాయాలన్నా, లేదా ఉన్న చరిత్రను తిరగరాయాలన్నా అది కేవలం యువతకే సాధ్యం అని ఆయన అన్నారు. మన యువత ప్రస్తుతం క్వాంటం వేగంతో దూసుకుపోతోందని, వారి ఉత్సాహమే రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో హైదరాబాద్ రూపురేఖలను హైటెక్ సిటీ ఏ విధంగా మార్చేసిందో, రాబోయే రోజుల్లో ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భారతదేశానికే గేమ్ ఛేంజర్గా మారబోతోందన్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇక్కడి నుంచే ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందుతాయని తెలిపారు. 2030 నాటికి దేశానికి 2.5 లక్షల మంది క్వాంటం నిపుణులు అవసరమని, అందులో ఏపీ సింహభాగం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న ప్రతి 100 మందిలో 35 మంది తెలుగువారే ఉండటం గర్వకారణమని అన్నారు.
సాంకేతికతపై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న అవగాహనను సీఎం కొనియాడారు. నేను ఎంతోమంది ప్రధాన మంత్రులతో పనిచేశాను, కానీ టెక్నాలజీపై ప్రధానికి ఉన్నంత అవగాహన మరెవరికీ లేదని ప్రశంసించారు. వాజపేయి హయాంలో టెలికమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పుల తరహాలోనే, ఇప్పుడు మోదీ నాయకత్వంలో 4G, తదుపరి తరం సాంకేతికతలతో దేశం పురోగమిస్తోందని అన్నారు. ఈ నెల 16న ప్రముఖ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ అమరావతికి రానున్నారు.
Off The Record : ఇద్దరు ఎంపీలపై పవన్ బాగా సీరియస్? ఎంత చెప్పినా ఎంపీల్లో మార్పు కనిపించడం లేదా?
ఏప్రిల్ 14న మరో రెండు క్వాంటం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంకా క్వాంటం మిషన్ కోసం టీసీఎస్ (TCS), ఐబీఎం (IBM), ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థలతో చర్చిస్తున్నామని.. ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, కందుల దుర్గేష్, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ కామకోటి తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖను మంత్రి లోకేష్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!