ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుండగా.. కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీని ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Read Also: MS Dhoni: రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో ధోనీ.. పాటలు పాడుతూ సందడి
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమై మొత్తం 10 సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.1,21,659 కోట్లు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన 10 ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేసింది. అలాగే వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్ చేయాలని ఎస్ఐపీబీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయం తీసుకుంది.
Read Also: Garlic Health Benefits: వెల్లులి నిజంగానే వ్యాధులను నయం చేస్తుందా? నిజమెంత!