CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్తు డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేసి కూరగాయల ధరలను నియంత్రించవచ్చని తెలిపారు.
Also Read
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ. 60 కోట్లతో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించామని తెలిపారు.
వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ. 190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, పశువులకు నీరు, తగినంత పశుగ్రాసం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్ నినో సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!