Bhatti Vikramarka: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎవ్వరూ ఆపలేరు..
Bhatti Vikramarka: మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా వెంటనే స్పందించిన మీ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన.. ఈ రోజు డిండీ నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎక్కడైనా భూములు కోల్పోతే.. వారికి అన్యాయం చేయకుండా 2013 అనే ఓ చట్టాన్ని తీసుకొచ్చి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందులో స్పష్టంగా పొందుపర్చామని.. నిర్వాసితులకు భూములు సేకరించిన సమయంలో ఉన్న ధరలకు అనుగుణంగా ఇవ్వాలని ఆ చట్టం చెబుతుంది.. ఇల్లు కోల్పోతే ఇల్లు.. ఊరు పోతే ఊరు మొత్తం నిర్మించేలా ఆ చట్టంలో ఉంది.. ఆ చట్టాన్ని సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనంగా లేదన్నారు.. అసలు మేం తెలంగాణలో ఉన్నామా? పాకిస్థాన్లో ఉన్నామా? అనే ప్రశ్నించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Bhatti Vikramarka: సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
తాను ఆదిలాబాద్లో చేపట్టిన పాదయాత్ర ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లకు చేరుకుందని తెలిపారు సీఎల్పీ నేత భట్టి.. ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఆనందంగా ఉన్నారు తప్ప.. ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.. దీనిని ఎవ్వరూ ఆపలేరు.. కేసీఆర్, హరీష్రావు.. వారి తాతలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునే పరిస్థితి లేదన్నారు. నేను ఆదిలాబాద్ నుంచి చేస్తున్న పాదయాత్రలో ఎంతో మంది ప్రజల స్పందనను చూసే ఈ మాట చెబుతున్నాను.. ప్రాజెక్టుల నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇక, ధరణిలో లోపాల గురించి మాట్లాడితే.. వారిని బంగాళాఖాతంలో కలిపేస్తారని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. ఎన్నో ఏళ్లుగా భూముల రికార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. రికార్డుల ప్రకారం అందరికీ న్యాయం చేస్తూ వచ్చాం.. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులను సర్వనాశనం చేసి.. కోట్లాది విలువైన భూములను కొట్టేయాలన్న ఉద్దేశంతోనే ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ధరణి ముసుగులో దేశంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాన్ని బయటపెడుతుందని వార్నింగ్ ఇచ్చారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో