West Bengal: చివరి కోరికగా రసగుల్లాలు ఇచ్చి మరీ స్నేహితుడిని చంపిన 8వ తరగతి విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Student Murder: మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఏ దోమనో, చీమనో చంపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. శిక్ష గురించి భయపడటం లేదు, పాపం పుణ్యం అని ఆలోచించడం లేదు. ఇక మానవ్వతం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లు, సినిమాలు, సీరియల్స్ చూసి హత్యలు కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఆన్ లైన్ గేమింగ్ కోసం అయితే కొంత మంది ప్రాణాలు తీసేకుంటున్నారు లేదా ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తన తోటి స్నేహితుడిని డబ్బల కోసం చంపేశారు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు.
Also Read: Gang Rape: దారుణం.. మహిళా గార్డుపై గ్యాంగ్ రేప్
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
పశ్చిమ బెంగాల్ నడియా జిల్లాలో దారుణం జరిగింది. తమ తోటి స్నేహితుడినే డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేశారు ముగ్గురు 8 వ తరగతి విద్యార్థులు. తమ కొడుకు స్నేహితులను కలవడానికి వెళ్లి తిరిగి రాలేదని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ముగ్గురును అరెస్ట్ చేశారు. ఇక ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడిని రమ్మని పిలిచారు. దీంతో ఆ బాలుడు శుక్రవారం సైకిల్ తో స్నేహితుల వద్దకు వెళ్లాడు. వారు అతడిని కిడ్నాప్ చేసి ఇంట్లో వారికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి కొడుకును చంపేస్తామని బెదిరించారు. ఆ వచ్చిన డబ్బుతో ఒక గేమింగ్ ల్యాప్ టాప్ కొనాలని వారు ఫథకం వేశారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బాలుడి ఇంటిలోని వారు నిరాకరించారు.దీంతో ఆ ముగ్గురు కలిసి స్నేహితుడని కూడా చూడకుండా బాలుడిని చంపేశారు. అయితే చంపేముందు బాలుడి చివరి కోరికను అడిగి అతడికి రసగుల్లాలు, కూల్ డ్రింక్ తినిపించి మరీ చంపేశారు. చిన్న పిల్లలు ఇంతటి దారుణానికి పాల్పడటంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ కు గురయ్యారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్దయ్యాక ఎంతటి దారుణానికి పాల్పడతారో అని భయపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు జువెలిన్ కోర్టుకు హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!