Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని కోర్టు వెలుపల పోలీసులు, లాయర్ల మధ్య బుధవారం జరిగిన హింసాత్మక ఘర్షణలో 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 50 మంది న్యాయవాదులను అరెస్టు చేయగా, దీనికి వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీతో సంబంధమున్న న్యాయవాదులపై తీవ్రవాద కేసులు నమోదు చేయడం.. సబార్డినేట్ కోర్టును మరొక ప్రదేశానికి మార్చడంపై లాహోర్ హైకోర్టు (ఎల్హెచ్సి) బయట లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
Read Also:Goa: గోవా సీఎం మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి సాయం
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఎల్ హెచ్ సీ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణతో మాల్ రోడ్డు యుద్ధభూమిగా మారింది. ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై లాఠీచార్జి చేసిన పోలీసులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పంజాబ్ పోలీసులు 50 మందికి పైగా న్యాయవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంటనే, పంజాబ్ పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. ఈ ఘర్షణలో 22 మందికి పైగా లాయర్లు, పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా కనీసం 14 మంది పోలీసులు ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించామని లాహోర్ సీనియర్ పోలీసు అధికారి కమ్రాన్ ఫైసల్ తెలిపారు.
Read Also:India Maldives Tension: నేడు భారత్లో పర్యటించనున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి..
లాయర్లు మొదట పోలీసులపై రాళ్లు రువ్వారని, ప్రతిస్పందనగా వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్.. వాటర్ ఫిరంగిని ఉపయోగించారని ఫైసల్ పేర్కొన్నాడు. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగుతుండగా, లాయర్లపై బలప్రయోగాన్ని నివారించాలని పంజాబ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!