Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని కోర్టు వెలుపల పోలీసులు, లాయర్ల మధ్య బుధవారం జరిగిన హింసాత్మక ఘర్షణలో 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 50 మంది న్యాయవాదులను అరెస్టు చేయగా, దీనికి వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీతో సంబంధమున్న న్యాయవాదులపై తీవ్రవాద కేసులు నమోదు చేయడం.. సబార్డినేట్ కోర్టును మరొక ప్రదేశానికి మార్చడంపై లాహోర్ హైకోర్టు (ఎల్హెచ్సి) బయట లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
Read Also:Goa: గోవా సీఎం మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి సాయం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ఎల్ హెచ్ సీ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణతో మాల్ రోడ్డు యుద్ధభూమిగా మారింది. ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై లాఠీచార్జి చేసిన పోలీసులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పంజాబ్ పోలీసులు 50 మందికి పైగా న్యాయవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంటనే, పంజాబ్ పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. ఈ ఘర్షణలో 22 మందికి పైగా లాయర్లు, పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా కనీసం 14 మంది పోలీసులు ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించామని లాహోర్ సీనియర్ పోలీసు అధికారి కమ్రాన్ ఫైసల్ తెలిపారు.
Read Also:India Maldives Tension: నేడు భారత్లో పర్యటించనున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి..
లాయర్లు మొదట పోలీసులపై రాళ్లు రువ్వారని, ప్రతిస్పందనగా వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్.. వాటర్ ఫిరంగిని ఉపయోగించారని ఫైసల్ పేర్కొన్నాడు. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగుతుండగా, లాయర్లపై బలప్రయోగాన్ని నివారించాలని పంజాబ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!