ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో ముగిసిన సీఐడీ విచారణ
- బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో ముగిసిన సీఐడీ విచారణ
- బ్యాంక్ మేనేజర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఫైనాన్స్ సంస్థ, ట్రేడింగ్ సంస్థలను ఏర్పాటు చేసి పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. స్కాంలో పాత్రధారులుగా ఉన్న ప్రభు శేఖర్, అజిత్ సింగ్ సహా మరికొందరి పాత్రపై సీఐడీ ఆధారాలు సేకరిస్తోంది.
Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంకి బెజవాడలో లింకులపై సీఐడీ ఫోకస్ పెట్టగా.. స్కాంలో బ్యాంక్ మాజీ ఉద్యోగి నరేష్కు ప్రభుశేఖర్ సహకరించినట్టు గుర్తించారు. నరేష్ ఆర్థిక సాయంతో ప్రభుశేఖర్ నరజ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు భారీగా చేసినట్టు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో పాటు అక్లాస్ అనే సంస్థకు కూడా పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కాంలో కీలక పాత్ర పోషించిన నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్, స్టానికుడైన రాజేష్ వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుశేఖర్ను వారం క్రితం ఒక కేసులో హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు సీఐడీ గుర్తించింది. బెజవాడలో పలువురు కస్టమర్ల నుంచి ఇదే విధంగా చేసినట్టు గుర్తించింది. ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ ఐసీఐసీఐ బ్రాంచ్లలో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్గా పనిచేసిన నరేశ్ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!