ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో ముగిసిన సీఐడీ విచారణ
- బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో ముగిసిన సీఐడీ విచారణ
- బ్యాంక్ మేనేజర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఫైనాన్స్ సంస్థ, ట్రేడింగ్ సంస్థలను ఏర్పాటు చేసి పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. స్కాంలో పాత్రధారులుగా ఉన్న ప్రభు శేఖర్, అజిత్ సింగ్ సహా మరికొందరి పాత్రపై సీఐడీ ఆధారాలు సేకరిస్తోంది.
Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంకి బెజవాడలో లింకులపై సీఐడీ ఫోకస్ పెట్టగా.. స్కాంలో బ్యాంక్ మాజీ ఉద్యోగి నరేష్కు ప్రభుశేఖర్ సహకరించినట్టు గుర్తించారు. నరేష్ ఆర్థిక సాయంతో ప్రభుశేఖర్ నరజ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు భారీగా చేసినట్టు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో పాటు అక్లాస్ అనే సంస్థకు కూడా పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కాంలో కీలక పాత్ర పోషించిన నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్, స్టానికుడైన రాజేష్ వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుశేఖర్ను వారం క్రితం ఒక కేసులో హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు సీఐడీ గుర్తించింది. బెజవాడలో పలువురు కస్టమర్ల నుంచి ఇదే విధంగా చేసినట్టు గుర్తించింది. ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ ఐసీఐసీఐ బ్రాంచ్లలో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్గా పనిచేసిన నరేశ్ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!