Chiranjeevi : దటీజ్ చిరు.. ఆయనకు అభిమానులంటే ఎంత గౌరవమో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా ప్రస్తుతం విశ్వంభర అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్.. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే మెగా స్టార్ కు పలు అరుదైన గౌరవాలు దక్కాయి. మొదటిగా దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవిని వరించగా మొన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా మెగాస్టార్ కైవసం చేసుకుని టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించారు.
Read Also:DSC Results 2024: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) – 2024 అవార్డ్స్ లో కూడా మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మరో స్పెషల్ అవార్డుని గెలుచుకున్నారు. అబుదాబిలో జరుగుతున్న ఈ వేడుకలకు చిరంజీవి హాజరై ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిరు ఆ అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ మెగా అభిమానులని మరింత ఆనందంలో ముంచేశాయి. తనకి తన అభిమానులని మించిన అవార్డు ఇంకొకటి లేదన్నారు. వారి తర్వాతే మిగతా అవార్డులు అనే రీతిలో తన అభిమానులకి తన గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో చెప్పకనే చెప్పారు. దీనితో చిరు విషయంలో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Israeli Strike: బీరుట్లో ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. నలుగురు మృతి
ఐఫా 2024 పురస్కారాల్లో మరో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గోల్డెన్ లెగసీ పురస్కారాన్ని, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా, హీరోయిన్ సమంత ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాల్ని అందుకున్నారు. ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. తెలుగు నుంచి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ కలిసి సందడి చేయడం వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..