Chintakayala Vijay: అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. హైదరాబాదులో మా ఇంటి పైకి సీఐడీ అధికారులు వచ్చారు.చిన్న పిల్లలను కూడా బెదిరించారు.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు వచ్చానన్నారు. నన్ను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పింది.వాళ్ల విచారణకు సహకరించాలని వచ్చాను. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో రాలేదు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చాను.
బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది. సెంటు భూమి కోసం మా ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారు. అక్రమ కేసులతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారు.ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.అయ్యన్నపాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోంది.సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారు.తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో ఇదంతా జరుగుతోంది.ఇలా సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలి.భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది.అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కొడాలి, పేర్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిలు ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కున్నారు.ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరు.
Also Read
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
Read Also: Hansika: అరుదైన ప్రయోగంలో హన్సిక ప్రధాన పాత్ర…
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతుంది.అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ చేయాలని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.కానీ ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నారు. కోటేశ్వరరావు, చింతకాయల విజయ్ న్యాయవాది.భారతీ పే యాప్ వ్యవహారంలో విజయ్పై కేసు పెట్టారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు చెప్పింది. సీఐడీ అధికారులు చాలా రకాల వస్తువులు తీసుకుని రమ్మన్నారన్నారు.
Read Also: Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!