Chinta Mohan: వాట్సప్ పరిపాలన అంటూ.. చంద్రబాబు వాటాల పరిపాలన చేస్తున్నారు!
- 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసింది ఏమీ లేదు
- చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం
- కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ‘వాట్సప్ పరిపాలన అంటూ.. వాటాల పరిపాలన’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని చింతా మోహన్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
’15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం. చంద్రబాబు వాట్సప్ పరిపాలన అంటూ వాటాల పరిపాలన చేస్తున్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం. కమిషన్ల కోసం కక్కుర్తిపడి మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కి చంద్రబాబు ప్రతిపక్షాన్ని కూనీ చేస్తున్నారు. యూరియా, ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదు. ఎస్సీ వర్గీకరణ వెంటనే వెనుకకు తీసుకోవాలి’ అని సీనియర్ నాయకులు చింతా మోహన్ డిమాండ్ చేశారు.
Also Read
- Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
- Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ 'చికెన్ పచ్చడి'.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
Also Read: AP Liquor Scam: 3 గంటల హైడ్రామా తర్వాత.. లిక్కర్ స్కాం నిందితులు విడుదల!
‘దేశంలో ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉంది. 60 లక్షల కోట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయి. ప్రధాని మోడీతో ఎలక్షన్ కమిషన్ మిలాఖాత్ అయింది. ఎలక్షన్ కమిషన్లో దొంగ పనులు చేస్తున్నారు. ఎన్నికల్లో విధానంలో మార్పులు అవసరం. రష్యా వాళ్లు లీటర్ పెట్రోలు రూ.30 రూపాయలకు ఇస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్న ఆయిల్ను బీజేపీ ప్రభుత్వం తన మిత్రులకు ఇస్తుంది, ఇది దొంగ విధానం. ఇది మోడీ, అమిత్ షా చేస్తున్న దుర్మార్గం అన్యాయం. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి పెట్రోల్ బంకులు వద్ద ఆందోళన చేయాలని పిలుపునిస్తున్నా. ఏ రకంగా రుణమాఫీ చేస్తున్నారు. 10% కమిషన్ తీసుకుని గుజరాత్, ఆంధ్రలోనూ రుణమాఫీ చేశారు’ అని చింతా మోహన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!