AP Liquor Scam: 3 గంటల హైడ్రామా తర్వాత.. లిక్కర్ స్కాం నిందితులు విడుదల!
- లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్
- ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల
- నివాసాలకు వెళ్లిపోయిన ముగ్గురు నిందితులు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్ అయ్యారు. కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు ఈరోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు విడుదల అయ్యారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. విజయవాడ జైలు అధికారులు కావాలనే తమని ఆలస్యంగా విడుదల చేశారని నిందితులు తెలిపారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్లను తీసుకుని వారి తరఫు న్యాయవాదులు విజయవాడ జైలు వద్దకు వెళ్లారు. అప్పటికే సమయం పూర్తి కావడంతో వారిని జైలు అధికారులు విడుదల చేయలేదు. ఈరోజు ఉదయం కూడా జైలు వద్ద హైడ్రామా నెలకొంది. జైలర్ బస్సులో వస్తున్నారంటూ అధికారులు చెబుతూ సమయం గడిపారు. దాంతో బెయిల్ ఇచ్చినా కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ముగ్గురు రిలీజ్ అయ్యారు.
Also Read
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
Also Read: AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్!
ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు అధికారులు. మరోవైపు ఏసీబీ కోర్టులో నిందితులు పిటిషన్ వేయనున్నారు. బెయిల్ ఇచ్చినా జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 3 గంటల పాటు విడుదల చేయలేదని పిటిషన్ వేయనున్నారు. రేపు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్ వేయనున్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!