Dengue in Karnataka: కర్ణాటకలో డెంగ్యూ కలకలం..రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
- 100 శాంపిల్స్ పరీక్షించగా 13-14 శాతం డెంగ్యూ పాజిటివ్గా వచ్చిందన్న ప్రతిపక్ష నేత ఆర్ అశోక్
- ఇప్పటి వరకు రెండు లక్షల మందికి సోకిన వ్యాధి
- త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోక్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. డెంగ్యూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి.. నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి తాలూకాలో టాస్క్ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ.. ‘జనవరి నుంచి రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతి చెందుతున్నారు. ప్రతిరోజు డెంగ్యూతో మూడు నుంచి నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. ఇది బాధాకరం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నా.. ప్రభుత్వం మాత్రం సరిగ్గా స్పందించడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Goa: వాటర్ఫాల్స్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు.. 50 మంది రెస్క్యూ, మరో 30 మంది కోసం..
Also Read
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్యులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 100 శాంపిల్స్ పరీక్షించగా 13-14 శాతం డెంగ్యూ పాజిటివ్గా తేలిందని ఆయన వెల్లడించారు. కో-మోర్బిడిటీ ఉన్నవారిలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు వెల్లడైనట్లు తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా డెంగ్యూ సోకినట్లు అంచనా వేశారు. విచారణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు. పరీక్ష కోసం రూ. 600-1,000 వసూలు చేస్తున్నారని.. పేద ప్రజలు పరీక్షలు చేయించుకోకపోతున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!