Dengue in Karnataka: కర్ణాటకలో డెంగ్యూ కలకలం..రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
- 100 శాంపిల్స్ పరీక్షించగా 13-14 శాతం డెంగ్యూ పాజిటివ్గా వచ్చిందన్న ప్రతిపక్ష నేత ఆర్ అశోక్
- ఇప్పటి వరకు రెండు లక్షల మందికి సోకిన వ్యాధి
- త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోక్ సూచన
కర్ణాటకలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. డెంగ్యూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి.. నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి తాలూకాలో టాస్క్ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ.. ‘జనవరి నుంచి రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతి చెందుతున్నారు. ప్రతిరోజు డెంగ్యూతో మూడు నుంచి నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. ఇది బాధాకరం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నా.. ప్రభుత్వం మాత్రం సరిగ్గా స్పందించడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Goa: వాటర్ఫాల్స్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు.. 50 మంది రెస్క్యూ, మరో 30 మంది కోసం..
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్యులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 100 శాంపిల్స్ పరీక్షించగా 13-14 శాతం డెంగ్యూ పాజిటివ్గా తేలిందని ఆయన వెల్లడించారు. కో-మోర్బిడిటీ ఉన్నవారిలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు వెల్లడైనట్లు తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా డెంగ్యూ సోకినట్లు అంచనా వేశారు. విచారణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు. పరీక్ష కోసం రూ. 600-1,000 వసూలు చేస్తున్నారని.. పేద ప్రజలు పరీక్షలు చేయించుకోకపోతున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!